యాప్నగరం

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మొర్తజాకి మళ్లీ కరోనా పాజిటివ్

ముష్రఫె మొర్తజాకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలింది. 14 రోజుల చికిత్స తర్వాత ఈరోజు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలడంతో రానున్న బుధవారం మూడో సారి పరీక్షలు చేయనున్నారు.

Samayam Telugu 4 Jul 2020, 8:49 pm
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్రఫె మొర్తజాకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలింది. గత నెలలో తనకి కరోనా సోకినట్లు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన మొర్తజా.. ఢాకాలోని తన నివాసంలో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. కానీ.. ఇప్పటికీ అతను ఆ వైరస్ బారి నుంచి కోలుకోలేదని తాజా పరీక్షల్లో తేలిపోయింది. రానున్న బుధవారం మూడోసారి అతనికి కరోనా పరీక్షలు చేయనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వెల్లడించింది.
Samayam Telugu Mashrafe Mortaza
Mashrafe Mortaza (Getty Images)


బంగ్లాదేశ్‌కే చెందిన అంతర్జాతీయ క్రికెటర్ నఫీస్ ఇక్బాల్ తొలుత కరోనా వైరస్ బారినపడగా.. రోజుల వ్యవధిలోనే మొర్తజాకి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని జూన్ 20న అభిమానులతో పంచుకున్న మొర్తజా.. త్వరలోనే ఈ వైరస్ నుంచి కోలుకుని మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చాడు. కానీ.. శనివారం నిర్వహించిన పరీక్షల్లో అతనికి మళ్లీ పాజిటివ్ వచ్చింది.

‘‘కరోనా విషయంలో చాలా వరకూ పేషంట్ 14 రోజుల్లోనే కోలుకుంటాడు. కానీ.. కొన్ని కేసుల్లో మాత్రం మరికొన్ని రోజులు అదనపు సమయం పడుతుంది’’ అని బీసీబీ ఫిజీషియన్ దెబశిష్ చౌదరి వెల్లడించాడు. బంగ్లాదేశ్ క్రికెటర్లే కాదు.. పాకిస్థాన్‌కి చెందిన పది మంది క్రికెటర్లకి కూడా ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే.. నాలుగు రోజుల వ్యవధిలోనే అందులో ఆరుగురికి నెగటివ్‌రాగా.. నలుగురికి మాత్రం మళ్లీ పాజిటివ్ వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.