యాప్నగరం

సెలక్టర్లకి ఆ ఓపెనర్ స్కోర్లు కనిపించలేదా..?

రంజీ ట్రోఫీలో 1,160 పరుగులు చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 258 పరుగులు చేశాడు. ఆ తర్వాత.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 723 పరుగులు సాధించాడు

Samayam Telugu 11 Oct 2018, 5:14 pm
వెస్టిండీస్‌తో హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు కోసం ఈరోజు భారత జట్టుని ప్రకటించిన సెలక్టర్లపై అభిమానులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో డకౌటైన కేఎల్ రాహుల్‌‌కి రెండో టెస్టులోనూ అవకాశం ఇవ్వడం, దేశవాళీ క్రికెట్‌లో అత్యద్భుతంగా రాణించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కి చోటివ్వకపోవడంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. రాజ్‌కోట్‌ టెస్టులో ఆడిన 11 మందిని అలానే కొనసాగించిన సెలక్టర్లు.. 12వ ఆటగాడిగా ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌ని తాజాగా జట్టులోకి చేర్చి టీమ్‌ని ప్రకటించారు. దీంతో మయాంక్ అగర్వాల్‌తో పాటు హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారికి నిరాశ తప్పలేదు.
Samayam Telugu Do0CZWfX4AIcOzV (1)


హైదరాబాద్‌ టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్

దేశవాళీ క్రికెట్‌లో గత ఏడాదికాలంగా మయాంక్ అగర్వాల్ పరుగుల మోత మోగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో 1,160 పరుగులు చేసిన ఈ ఓపెనర్.. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 258 పరుగులు చేశాడు. ఆ తర్వాత.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 723 పరుగులు సాధించాడు. అయినప్పటికీ.. అతనికి భారత జట్టులో చోటు దక్కకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.