యాప్నగరం

సచిన్‌ సూచన.. తుది జట్టులో 14 మంది

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే..

TNN 26 Oct 2017, 7:20 pm
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే.. అతను ఏం చెప్పినా.. అది ఆటకి ఉపయోగపడే విధంగా ఉంటుందని అందరి విశ్వాసం. దీనికి నిదర్శనమే పాఠశాల స్థాయి క్రికెట్‌ తుది జట్టులో 14 మంది ఆటగాళ్లకి చోటు కల్పించాలనే సూచన. గత ఏడాది సచిన్ సూచించిన ఈ వినూత్న పద్ధతిని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తాజాగా తమ పరిధిలో జరిగే టోర్నీల్లో అమలు చేసేందుకు రెడీ అయ్యింది.
Samayam Telugu mca agrees to implement sachins 14 per side
సచిన్‌ సూచన.. తుది జట్టులో 14 మంది


సాధారణంగా తుది జట్టులో 11 మంది ఆటగాళ్లకి మాత్రమే చోటు దక్కుతుంది. అలా కాకుండా.. జట్టులోకి 14 మందిని ఎంపిక చేసుకుంటే.. అదనంగా ముగ్గురు క్రికెటర్లకి ఛాన్స్ దొరుకుతుందని సచిన్ ఆలోచన. జట్టు బ్యాటింగ్ బలహీనంగా ఉంటే.. అదనంగా ముగ్గరిని టాప్ ఆర్డర్‌లోకి చేర్చుకోవచ్చు. వారు బ్యాటింగ్ మాత్రమే చేసి.. కూర్చుంటారు. ఫీల్డింగ్‌కి రారు. ఒకవేళ బౌలింగ్ బలహీనంగా ఉంటే.. అంతకముందు బ్యాటింగ్ చేసిన ముగ్గురు టాప్ ఆర్డర్ ఆటగాళ్లని కూర్చోబెట్టి వారి స్థానంలో ముగ్గురు బౌలర్లని మైదానంలోకి తీసుకోవచ్చు. జట్టు అవసరానికి తగినట్లుగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ లేదా ముగ్గురు బౌలర్లని మార్చుకునే సదుపాయం ఈ మార్పు వల్ల లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.