యాప్నగరం

ధోనీ గెలిచినా.. ఓడినా ఒకేలా ఉంటాడు: మైకేల్ హస్సీ

రిక్కీ పాంటింగ్, మహేంద్రసింగ్ ధోనీ.. గెలుపోటముల్ని ఒకేలా తీసుకుంటారు. ఒకవేళ కెప్టెన్‌ ఎమోషనల్‌గా ఉంటే.. జట్టులోనూ ఒత్తిడి వాతావరణం ఉంటుంది. - మైకేల్ హస్సీ

Samayam Telugu 15 Jul 2020, 8:54 pm
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గెలుపోటముల్ని ఒకేలా తీసుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ కొనియాడాడు. ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరు సీజన్‌లు ఆడిన మైకేల్ హస్సీ.. ఆ జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్ సమయంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడినా.. గెలిచినా ధోనీ ఒకే తరహాలో కూల్‌గా వ్యవహరించేవాడని గుర్తుచేసుకున్న హస్సీ.. అప్పట్లో రిక్కీ పాంటింగ్‌ కూడా ఇలానే ఉండేవాడని వెల్లడించాడు.
Samayam Telugu MS Dhoni


‘‘రిక్కీ పాంటింగ్‌ మ్యాచ్‌లో సెంచరీ బాదినా.. డకౌట్ అయినా ఒకేలా ఉంటాడు. మహేంద్రసింగ్ ధోనీ కూడా వరుసగా నాలుగు మ్యాచ్‌‌ల్లో టీమ్ గెలిచినా.. ఓడినా కూల్‌గానే ఉంటాడు. ముఖ్యంగా.. ఒక టీమ్‌ కెప్టెన్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం అది. ఒకవేళ టీమ్ కెప్టెన్ ఎమోషనల్‌ పర్సన్ అయితే.. ఎత్తుపల్లాల సమయంలో జట్టులోనూ ఒత్తిడి వాతావరణం ఉంటుంది. అలా కాకుండా కెప్టెన్ ధోనీలా కూల్‌గా ఉంటే.. జట్టు నిలకడగా రాణించే అవకాశం ఉంది’’ అని మైకేల్ హస్సీ వెల్లడించాడు.

రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లను గెలవగా.. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. అలానే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్‌ని ధోనీ అందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.