క్రికెటర్లు ఎలాంటి భయాందోళనకి గురికాకుండా లాహోర్కి వచ్చి పాకిస్థాన్తో టీ20 మ్యాచ్ ఆడాలని పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్ అభ్యర్థించాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య సిరీస్ జరగుతోంది. అయితే .. ఈ సిరీస్లో చివరి టీ20 మ్యాచ్ని మాత్రం అక్టోబరు 29న లాహోర్లో నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు. కానీ.. లాహోర్లో టీ20 మ్యాచ్ ఆడబోమని.. వేదికను మార్చాల్సిందిగా శ్రీలంక క్రికెట్ బోర్డుని ఆ దేశ క్రికెటర్లు అభ్యర్థిస్తూ ఇటీవల లేఖ రాశారు. 2009లో లాహోర్లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు శ్రీలంక క్రికెటర్లు బస్సులో ప్రయాణిస్తుండగా వారిపై టెర్రరిస్ట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
‘శ్రీలంక క్రికెటర్లకి ఇదే నా అభ్యర్థన. లాహోర్కి వచ్చి మ్యాచ్ని ఆస్వాదించండి. పాకిస్థాన్ అభిమానులు మీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నేను కూడా లంక జట్టుతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఉన్నాను. ఇటీవల ప్రపంచ ఎలెవన్ జట్టు ఇక్కడ పర్యటించి పాక్తో మూడు టీ20ల సిరీస్ ఆడింది. ఈ మ్యాచ్లకి అభిమానుల నుంచి ఊహించని ఆదరణ లభించింది. ఇప్పుడు శ్రీలంకతో లాహోర్ టీ20కి కూడా అంతకుమించిన ఆదరణ అభిమానుల నుంచి లభిస్తుంది’ అని మిక్కీ ఆర్థర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘శ్రీలంక క్రికెటర్లకి ఇదే నా అభ్యర్థన. లాహోర్కి వచ్చి మ్యాచ్ని ఆస్వాదించండి. పాకిస్థాన్ అభిమానులు మీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నేను కూడా లంక జట్టుతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఉన్నాను. ఇటీవల ప్రపంచ ఎలెవన్ జట్టు ఇక్కడ పర్యటించి పాక్తో మూడు టీ20ల సిరీస్ ఆడింది. ఈ మ్యాచ్లకి అభిమానుల నుంచి ఊహించని ఆదరణ లభించింది. ఇప్పుడు శ్రీలంకతో లాహోర్ టీ20కి కూడా అంతకుమించిన ఆదరణ అభిమానుల నుంచి లభిస్తుంది’ అని మిక్కీ ఆర్థర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.