యాప్నగరం

టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిస్బా

పాకిస్థాన్ క్రికెటర్ మిస్బాఉల్ హక్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్‌తో సిరీసే తనకు చివరిదని చెప్పాడు

TNN 6 Apr 2017, 1:31 pm
పాకిస్థాన్ క్రికెటర్ మిస్బాఉల్ హక్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్‌తో సిరీసే తనకు చివరిదని చెప్పాడు. మిస్బా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడక ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. బుధవారం షహర్యార్ లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మిస్బాకు ఇదే చివరి టెస్టు సిరీస్ అని ప్రకటించారు. ఇప్పటి వరకూ అతడితో ఈ విషయమై ఎలాంటి చర్చలు కూడా జరపలేదని చెప్పారు. దీన్ని బట్టి బోర్డు ఒత్తిడితోనే 42 ఏళ్ల మిస్బా టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu misbahul haq announces retirement
టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిస్బా


న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌‌లలో వైట్‌వాష్‌కు గురవడంతో మిస్బా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. 2010 చివరి నుంచి చాలా కాలం పాటు పాక్ క్రికెట్ జట్టును టెస్టుల్లో విజయవంతంగా ముందుకు నడిపించాడు. క్రికెట్ నుంచి రిటైర్ కావాలని మాజీలు, విమర్శకులు చాలా కాలంగా సూచిస్తున్నప్పటికీ అతడు మాత్రం వాటిని పట్టించుకోలేదు.

పీసీబీ ఇప్పటికే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. దీంతో విండీస్ పర్యటన తర్వాత అతడికే టెస్టు జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు భావిస్తున్నారు. సర్ఫరాజ్ ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

వెస్టిండీస్‌ పర్యటనే నాకు చివరి టెస్టు సిరీస్ కానుందని లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో హక్ మీడియా సమక్షంలో తెలిపాడు. దేశవాళీ క్రికెట్లో ఆడతానని మిస్బా ప్రకటించాడు. 2015 ప్రపంచ కప్ నెగ్గాలని భావించినా అది నెరవేరలేదని మిస్బా చెప్పాడు. ఏప్రిల్ 22 నుంచి జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో మిస్బా పాక్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.