యాప్నగరం

కీపర్‌గా పంత్ ఎంపిక.. ‘మిస్ యూ ధోని’ వైరల్

ధోని వచ్చే ఏడాది జనవరి వరకూ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లేదు. అది కూడా ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కి ఎంపికైతేనే..!

Samayam Telugu 20 Nov 2018, 2:35 pm
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 కోసం భారత్ జట్టుని బీసీసీఐ ఈరోజు ప్రకటించగా.. ‘మిస్ యూ ధోని’ అంటూ ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ బాధని వ్యక్తపరుస్తున్నారు. 12 మందితో కూడిన జట్టుని మంగళవారం ప్రకటించిన బీసీసీఐ.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేసింది. దీంతో.. సుదీర్ఘకాలంగా టీమిండియా వికెట్ కీపర్‌‌గా ధోనీ పేరుని చూస్తున్న అతని అభిమానులు ‘మిస్ యూ ధోని’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ధోని వచ్చే ఏడాది జనవరి వరకూ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లేదు. అది కూడా ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కి ఎంపికైతేనే..!
Samayam Telugu 53Dhoni


ఈ ఏడాది ఇంగ్లాండ్ గడ్డపై వన్డే, టీ20ల్లో బ్యాట్‌తో నిరాశపరిచిన ధోని.. ఆ తర్వాత ఆసియా కప్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి ధోనీని తప్పించిన సెలక్టర్లు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చారు. అతను వెస్టిండీస్‌పై ఆఖరి టీ20 మ్యాచ్‌లో అర్ధశతకంతో సత్తాచాటాడు. దీంతో.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో‌నూ రిషబ్ పంత్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వనుంది.

తొలి టీ20కి బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, చాహల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.