యాప్నగరం

అమ్మాయిలకూ ఐపీఎల్‌ నిర్వహించండి..!

లీగ్ దశలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత్ జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ..

TNN 24 Jul 2017, 2:53 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన చూశాకైనా అమ్మాయిలకి ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన బీసీసీఐకి వస్తే బాగుంటుందని కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. చివరి వరకూ పోరాడి ఆకట్టుకుంది. టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్.. అగ్రశ్రేణి జట్లకి సైతం షాక్‌లిస్తూ ఫైనల్ చేరడంతో జట్టులోని ఒక్కో క్రికెటర్‌కి రూ.50లక్షల నజరానాని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
Samayam Telugu mithali raj hopes bcci will start ipl equivalent league for women cricketers
అమ్మాయిలకూ ఐపీఎల్‌ నిర్వహించండి..!


‘లీగ్ దశలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత్ జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ.. అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌తో తుదిపోరులో ఢీకొన్నాం. ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాస్ లీగ్‌లో మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడి ఉండటం ఇక్కడ కలిసొచ్చింది. జట్టులోని ఎక్కువ మందికి ఇలా ప్రైవేట్ లీగ్స్‌లో ఆడే అవకాశం లభిస్తే.. వారు తమ ఆటను మెరుగుపర్చుకుంటారు. భారత్ జట్టు ప్రదర్శనపై ప్రస్తుతం బీసీసీఐ సంతృప్తిగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మహిళల ఐపీఎల్‌కి శ్రీకారం చుట్టేందుకు ఇదే తగిన సమయం’ అని మిథాలీ రాజ్ వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.