యాప్నగరం

రనౌట్‌పై పెదవి విప్పిన మిథాలీ..!

మిథాలీ రాజ్ రనౌట్ మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో ఉంది. ఇంత పేలవంగా ఎలా రనౌటవుతారు..? నమ్మశక్యంగా లేదు’

TNN 25 Jul 2017, 6:56 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ రనౌట్‌ చర్చ సోషల్ మీడియాలో తీవ్రస్థాయికి చేరింది. మ్యాచ్ కీలక సమయంలో పేలవ రీతిలో పరుగు కోసం ప్రయత్నించి మిథాలీ రాజ్ రనౌటవడంతోనే భారత్ చివరికి 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిందని అభిమానులు విమర్శిస్తున్నారు. 229 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ మంధానా ఆదిలోనే డకౌట్‌గా వెనుదిరగడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఫామ్‌లో ఉన్న మిథాలీపై పడింది. ఈ దశలో జట్టు స్కోరు 43 వద్ద ఓపెనర్ పూనమ్ రౌత్ బంతిని స్కైర్ లెగ్ దిశగా తరలించి పరుగు కోసం మిథాలీని పిలిచింది. ఆలస్యంగా స్పందించిన మిథాలీ రాజ్.. వేగంగా క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగింది. ఫైనల్ లాంటి మ్యాచ్‌లో రనౌట్ నుంచి తప్పించుకునేందుకు మిథాలీ కనీసం డైవ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడంతో విమర్శలు చెలరేగాయి.
Samayam Telugu mithali raj opens up on her bizarre run out in icc wwc final
రనౌట్‌పై పెదవి విప్పిన మిథాలీ..!


‘మిథాలీ రాజ్ రనౌట్ మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో ఉంది. ఇంత పేలవంగా ఎలా రనౌటవుతారు..? నమ్మశక్యంగా లేదు’ అని ఒక అభిమాని ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. ఈ ట్వీట్‌పై చాలా మంది చర్చించుకోవడంతో మిథాలీ రాజ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘సోషల్ మీడియాలో కొంతమంది విచారకర రీతిలో రనౌట్‌ గురించి రాశారు. వాస్తవంగా అప్పుడు ఏం జరిగిందంటే..? పరుగు కోసం పూనమ్ పిలిచినప్పుడు నా షూ పిచ్‌‌పై ఇరుక్కుపోయింది. దీంతో నేను వేగంగా పరుగు అందుకోలేకపోయాను. సగం దూరం వచ్చేసరికే.. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ చేతికి బంతి దొరికిపోయింది. దీంతో నేను నిస్సహాయస్థితిలో డైవ్ కూడా చేయలేకపోయాను’ అని మిథాలీ రాజ్ వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.