యాప్నగరం

నా బయోపిక్‌లో ప్రియాంక అయితే ఓకే..!

భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ గురించి గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ బయోపిక్‌లో తొలుత కంగనా

Samayam Telugu 10 Jul 2018, 10:54 am
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ గురించి గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ బయోపిక్‌లో తొలుత కంగనా రనౌత్, ఆ తర్వాత ప్రియాంక చోప్రా నటించనుందంటూ గాసిప్స్ వచ్చాయి. కానీ.. ఇప్పటికీ అధికారికంగా ఆ సినిమాలో ఎవరు నటిస్తారో..? ప్రకటించలేదు. అయితే.. తన బయోపిక్‌లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మిథాలీ రాజ్ తాజాగా తన మనసులో మాట బయటపెట్టారు.
Samayam Telugu mithali raj says priyanka chopra ideal choice for her biopic
నా బయోపిక్‌లో ప్రియాంక అయితే ఓకే..!


‘నా కెరీర్‌పై తీయబోతున్న బయోపిక్‌లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుంది. నా పాత్రని ఆమె అయితే తెరపై చక్కగా పోషించగలదు. ఎందుకంటే.. మా ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే.. నాకు సినిమా రంగంపై పెద్దగా అవగాహన లేదు. కాబట్టి.. నటుల ఎంపిక నిర్ణయాన్ని సినిమా నిర్మాణ‌ సంస్థ అభీష్టానికే వదిలేశా’ అని మిథాలీ రాజ్ వెల్లడించింది. 2019‌లో మిథాలీ రాజ్ బయోపిక్‌ పట్టాలెక్కనుంది.

ఇప్పటికే భారత మహిళా బాక్సర్ మేరీకోమ్‌ బయోపిక్‌లో నటించిన ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీంతో.. మిథాలీ రాజ్ బయోపిక్‌కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో..? లేదో..? చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.