యాప్నగరం

Team India మేనేజ్‌మెంట్ తీరుపై పెదవి విరిచిన కైఫ్.. వికటించిన ప్రయోగం

IND vs WI 1st T20 లో రోహిత్ శర్మకి జోడీగా సూర్యకుమార్ యాదవ్‌ని ఓపెనర్‌గా ఆడించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిషబ్ పంత్‌ని ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై ఓపెనర్‌గా ఆడించగా.. అతను క్లిక్ అవుతున్నట్లు కనిపించాడు. కానీ.. సడన్‌గా?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 30 Jul 2022, 3:22 pm

ప్రధానాంశాలు:

  • తొలి టీ20లో ఓపెనర్‌గా ఆడిన సూర్యకుమార్ యాదవ్
  • వికటించిన ప్రయోగం.. టీమిండియాపై విమర్శలు
  • రిషబ్ పంత్‌కి మరో ఛాన్స్ ఇవ్వాలంటున్న కైఫ్
  • టీ20ల్లో రోహిత్ శర్మకి జోడీ కోసం వెతుకులాట
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rishabh Pant (Pic Credit: BCCI)
Rishabh Pant (Pic Credit: BCCI)
వెస్టిండీస్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం వికటించింది. ప్రొఫెషనల్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టిన భారత్ జట్టు.. మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ని ఓపెనర్‌గా ఆడించింది. కానీ.. అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. మ్యాచ్‌లో 16 బంతులాడిన సూర్యకుమార్ యాదవ్ 3x4, 1x6 సాయంతో 24 పరుగులే చేసి ఔటయ్యాడు. బంతిని బలంగా బాదేందుకు ఫస్ట్ ఓవర్ నుంచి ప్రయత్నించిన సూర్య.. ఐదో ఓవర్‌లో అకేల హొసెన్ బౌలింగ్‌లో జేసన్ హోల్డర్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వాస్తవానికి తొలి టీ20లో రోహిత్ శర్మకి జోడీగా రిషబ్ పంత్ (Rishabh Pant) ఓపెనర్‌గా ఆడతాడని అంతా ఊహించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై ముగిసిన టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌ ఓపెనర్‌గా ఆడాడు. ఓ మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. కానీ.. శుక్రవారం రాత్రి అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చాడు. దాంతో.. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కనిపించారు. వెస్టిండీస్‌తో తొలి టీ20లోనూ రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడించి ఉంటే బాగుండేదని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) అభిప్రాయపడ్డాడు.

‘‘రోహిత్ శర్మకి జోడీగా తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు ఓపెనర్‌గా ఆడించారో నాకు అర్థం కావడం లేదు. రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ట్రై చేయాలని అనుకున్నారు. ఆ క్రమంలో ఓ 2-3 ఛాన్స్‌లు కూడా ఇచ్చారు. కానీ.. సడన్‌గా ఇప్పుడు మళ్లీ అతడ్ని మిడిలార్డర్‌కి మార్చారు. అలాకాకుండా.. కనీసం ఓ ఐదు ఛాన్స్‌లైనా రిషబ్ పంత్‌కి ఓపెనర్‌‌గా ఇవ్వాలి. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆ దిశగా ఆలోచించి.. ప్లేయర్లకి కనీసం 5-6 మ్యాచ్‌ల్లో మద్దతుగా నిలవాలి’’ అని కైఫ్ సూచించాడు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.