యాప్నగరం

కుమార్తెని చూసి మహ్మద్ షమీ భావోద్వేగం..!

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకి ముందు యో-యో ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలై భారత జట్టులో స్థానం కోల్పోయిన మహ్మద్ షమీ తన కుమార్తెని

Samayam Telugu 21 Jun 2018, 7:41 pm
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకి ముందు యో-యో ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలై భారత జట్టులో స్థానం కోల్పోయిన మహ్మద్ షమీ తన కుమార్తెని చూడగానే భావోద్వేగానికి గురయ్యాడు. మహ్మద్ షమీతో గొడవలు కారణంగా అతని భార్య హసీన్ జాహన్ గత మూడు నెలల నుంచి పాపతో కలిసి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు మహ్మద్ షమీకి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కి కూడా పాల్పడినట్లు హసీన్ జాహన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షమీపై కోల్‌కతా పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో.. ఇద్దరూ విడిగా ఉంటున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే షమీకి రోడ్డు ప్రమాదం జరగగా.. అతడ్ని చూసేందుకు పాపతో కలిసి ఆసుపత్రికి వచ్చిన హసీన్ జాహన్‌తో షమీ మాట్లాడలేదు. అయితే.. పాపతో మాత్రం కాసేపు మాట్లాడినట్లు అప్పట్లో హసీన్ వెల్లడించింది.
Samayam Telugu 11

I'm very happy to see you my heartbeat babo I love you 😭😭😭 after 3 month ..long time A post shared by Mohammad Shami (@mdshami.11) on Jun 19, 2018 at 2:40am PDT

మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ షమీకి క్లీన్‌చిట్ ఇస్తూ ఐపీఎల్ 2018 సీజన్ ఆడేందుకు అనుమతిచ్చింది. దీంతో.. బిజీగా మారిపోయిన క్రికెటర్ మళ్లీ పాపని కలవలేకపోయాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత.. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకి ఎంపికైనా యో-యో టెస్టులో ఫెయిలవడంతో.. జట్టుకి దూరమయ్యాడు. కుటుంబం దూరమవడం, జట్టులో చోటు కోల్పోవడం వంటి సమస్యలతో మానసికంగా కుంగిపోయిన మహ్మద్ షమీ.. తన కూతురితో వీడియో ‌కాల్‌లో మాట్లాడగానే భావోద్వేగానికి గురయ్యాడు. మూడు నెలల తర్వాత మళ్లీ తనని చూసినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.