యాప్నగరం

టీమిండియా నుంచి మహ్మద్ షమీ తొలగింపు

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని సెలక్టర్లు తొలగించారు. బెంగళూరు వేదికగా

Samayam Telugu 11 Jun 2018, 7:10 pm
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని సెలక్టర్లు తొలగించారు. బెంగళూరు వేదికగా గురువారం నుంచి ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. సోమవారం నిర్వహించిన ఫిట్‌నెస్ (యో-యో) టెస్టులో షమీ విఫలమయ్యాడు. దీంతో అతడ్ని జట్టు నుంచి తొలగించినట్లు నిర్ధారించిన బీసీసీఐ.. షమీ స్థానంలో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు తెలిపింది.
Samayam Telugu 50


2017-2018 రంజీ సీజన్‌‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ షమీ 8 మ్యాచ్‌ల్లోనే 34 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనకి అతను ఎంపికయ్యాడు. అక్కడ ఆడిన మూడు టెస్టుల్లో మొత్తం 15 వికెట్లు పడగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్ విదేశీ గడ్డపై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. కానీ.. తాజాగా ఫిట్‌నెస్ట్ టెస్టులో అతను విఫలమవడంతో.. జులైలో ఇంగ్లాండ్ పర్యటనకి కూడా అతను వెళ్లడంపై అనుమానాలు నెలకొన్నాయి. కెరీర్ ఆరంభం నుంచి గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న షమీ.. 2015 ప్రపంచకప్ ముగిసిన తర్వాత గాయం కారణంగా కొన్ని నెలల పాటు ఆటకి దూరంగా ఉండాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.