యాప్నగరం

Mohammed Shami: షమీని వెంటాడిన బ్యాడ్ లక్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఉమేశ్ యాదవ్

Mohammed Shami: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు భారత జట్టుతోపాటు మొహలీ వెళ్లలేదు. షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత షమీకి టీ20ల్లో చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లో అతడికి ఛాన్స్ ఇచ్చిన సెలక్టర్లు తదుపరి వరల్డ్ కప్‌ కోసం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 18 Sep 2022, 11:46 am

ప్రధానాంశాలు:

  • మహ్మద్ షమీ బ్యాడ్ లక్
  • ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు కరోనా
  • సిరీస్ మొత్తానికీ దూరమయ్యే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Shami-Umesh Yadav
Shami-Umesh
Mohammed Shami: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు తొలి జరగనున్న మొహాలీకి జట్టుతోపాటు వెళ్లలేదు. దీంతో ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఆసీస్‌తో సిరీస్ మొత్తానికి షమీ దూరమైనట్లు వార్తలొస్తున్నాయి. అతడికి రీప్లేస్‌మెంట్‌గా ఉమేశ్ యాదవ్‌ (Umesh Yadav)కు పిలుపు అందింది. ఉమేశ్ ప్రస్తుతం గాయం కారణంగా బెంగళూరులోని రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఉమేశ్‌కు చోటు దక్కితే.. రెండేళ్ల తర్వాత భారత్ తరఫున అతడు ఆడబోతున్న తొలి టీ20 మ్యాచ్ ఇదే కానుంది.
గత ఐపీఎల్ సీజన్లో రాణించిన ఉమేశ్ యాదవ్.. పవర్ ప్లేలో మెరుగైన ప్రదర్శన చేశాడు. 7.06 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో మిడిల్‌సెక్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు వరుసగా సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, అక్టోబర్ 4 తేదీల్లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌ల్లో భారత్ తలపడనుంది.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఆడనుంది.
గత రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ (Mohammed Shami).. ఎలా రాణిస్తున్నాడో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లు ఉపయోగపడనున్నాయి. జులై నుంచి మైదానంలో బరిలోకి దిగని షమీ.. 2021 నవంబర్ నుంచి అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన షమీ.. 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసి.. ఆ జట్టు కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. దీంతో పది నెలలుగా అంతర్జాతీయ టీ20లు ఆడనప్పటికీ.. సెలక్టర్లు షమీని టీ20 వరల్డ్ కప్ కోసం స్టాండ్ బైగా ఎంపిక చేయాల్సి వచ్చింది.

షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు పిలుపు అందడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. మహ్మద్ సిరాజ్‌ (Mohammed Siraj)కు టీ20ల్లో ఎందుకు చోటు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. విరాట్ కోహ్లి కెప్టె్న్‌గా ఉన్న సమయంలో సిరాజ్‌ను మూడు ఫార్మాట్లలోనూ లీడింగ్ బౌలర్‌గా తీర్చిదిద్దాడని.. కానీ ప్రస్తుతం అతణ్ని పక్కనబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.