యాప్నగరం

గుండెపోటుతో షమీ తండ్రి కన్నుమూత

గుండెపోటు కారణంగా భారత క్రికెటర్ మహ్మద్ షమీ తండ్రి తౌసీఫ్ అలీ గురువారం రాత్రి మరణించారు.

TNN 27 Jan 2017, 4:44 pm
భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఇంట్లో విషాదం అలుముకుంది. గుండె పోటు కారణంగా ఆయన తండ్రి తౌసీఫ్ అలీ గురువారం రాత్రి మరణించారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగుండటంలేదు. జనవరి 5న గుండెపోటు రావడంతో తౌసీఫ్‌ను హాస్పిటల్లో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం కోలువడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. కానీ గురువారం రాత్రి సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహలో ఆయన ప్రాణాలు వదిలారు. కాన్పూర్‌లో జరిగిన తొలి వన్డే సందర్భంగా షమీ భారత జట్టుతోపాటే ఉన్నాడు.. షమీ గత రాత్రే అమ్రోహ చేరుకున్నాడు.
Samayam Telugu mohammed shamis father tousif ali dies after suffering heart attack
గుండెపోటుతో షమీ తండ్రి కన్నుమూత


తొలిసారి గుండెపోటు వచ్చాక తన తండ్రికి గుర్గావ్‌లోని హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగుపడిందని షమీ జనవరి 13న ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తెల్లవారు జామున నాన్నకు గుండెపోటు వచ్చిందని అందుకే అర్జెంట్‌గా బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్నానని జనవరి 5న మహ్మద్ షమీ ట్వీట్ చేశాడు. తన తండ్రి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. మెకాలి గాయం నుంచి కోలుకున్న షమీ ఆ సమయంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు.

Much better after operation in Gurgao pic.twitter.com/fCYtC1dOxy — Mohammed Shami (@MdShami11) January 13, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.