యాప్నగరం

IND vs BAN 2nd T20 Trolls: పంత్‌కి జోడీకి మరొక భారత క్రికెటర్.. ఈసారి మరింతగా పేలుతున్న జోక్స్

గత రెండు నెలలుగా రిషబ్ పంత్‌ని ట్రోల్ చేయడం అలవాటుగా మార్చుకున్న అభిమానులు.. తాజాగా పంత్‌కి జోడీగా ఖలీల్ అహ్మద్‌ని కూడా చేర్చారు. రెండో టీ20లోనూ హ్యాట్రిక్ ఫోర్లు సమర్పించుకోవడం ద్వారా ఖలీల్ ఈ జాబితాలో చేరాడు.

Samayam Telugu 8 Nov 2019, 10:31 am
భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం రాత్రి జరిగిన రెండో టీ20పై అభిమానులు సెటైరికల్‌గా స్పందిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (85: 43 బంతుల్లో 6x6, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలోనే ఛేదించేసి మూడు టీ20ల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. ఇక ఆదివారం రాత్రి విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu Rishabh Pant


undefined

మ్యాచ్‌లో కీపింగ్ తప్పిదాలకి పాల్పడిన యువ వికెట్ రిషబ్ పంత్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చాహల్ బౌలింగ్‌లో ఓపెనర్ లిట్టన్ దాస్‌ని స్టంపౌట్ చేసేందుకు తొందరపడిన రిషబ్ పంత్.. బంతి వికెట్లని దాటక ముందే అందుకుని బెయిల్స్ పడగొట్టాడు. దీంతో.. అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటించడంతో.. లిట్టన్ దాస్ బతికిపోయాడు. ఆ తర్వాత మరోసారి చాహల్ బౌలింగ్‌లోనే సౌమ్య సర్కార్‌ని స్టంపింగ్ సమయంలో దాదాపు పంత్ అదే తప్పిదానికి పాల్పడినట్లు కనిపించాడు. అయితే.. తొలుత నాటౌట్ అని ప్రకటించిన థర్డ్ అంపైర్ వెంటనే మళ్లీ ఔట్ అని స్క్రీన్స్‌పై వేయడంలో భారత్ ఊపిరి పీల్చుకుంది.

Read More: భారత్‌ని ఒంటిచేత్తో గెలిపించిన రోహిత్ శర్మ.. సిరీస్ ఆశలు సజీవం

క్రికెట్ రూల్స్ ప్రకారం.. బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్‌‌మెన్ శరీరం లేదా బ్యాట్‌కి తాకకపోతే..? అది వికెట్ల వెనక్కి వచ్చిన తర్వాతే అందుకోవాలి. అంతేతప్ప.. వికెట్ల ముందుకు వచ్చి కీపర్ దాన్ని అందుకోవడం నిబంధనలని విరుద్ధం. ఒకవేళ అలా అందుకుంటే అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించి.. బ్యాటింగ్ టీమ్‌కి ఫ్రీ హిట్ ఇస్తాడు. అయితే.. బ్యాట్స్‌మెన్ పరుగు తీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం అప్పుడు వికెట్ల ముందుకు వచ్చి దాన్ని అందుకోవచ్చు.


Read More: బంగ్లాపై రాజ్‌కోట్ టీ20తో రోహిత్ శర్మ @100

భారత ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ మరోసారి పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచాడు. గత ఆదివారం ముగిసిన తొలి టీ20లో తాను వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి నాలుగు బంతులకీ ఫోర్లు ఇచ్చిన ఖలీల్ రెండో టీ20లో తాను వేసిన తొలి ఓవర్‌ మొదటి మూడు బంతులకీ బౌండరీలు ఇచ్చేశాడు. దీంతో.. టీ20 చరిత్రలో వరుసగా తాను వేసిన ఏడు బంతుల్లోనూ బౌండరీలు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డ్ నెలకొల్పాడు. రెండో టీ20లో 4 ఓవర్లు వేసిన ఖలీల్ అహ్మద్ 11.00 ఎకానమీతో ఏకంగా 44 పరుగులిచ్చేశాడు. దీంతో.. అతడ్ని అభిమానులు ఉతికారేస్తున్నారు.











తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.