యాప్నగరం

IND vs BAN 3rd T20 Trolls: ధోనీ శిష్యుడు మళ్లీ ఫెయిల్.. ఇక చాలు సాగనంపండి

రిషబ్ పంత్‌కి ఇంకెన్ని అవకాశాలిస్తారు..? రెండు టీ20ల్లోనూ అతను చెప్పుకోదగ్గ షాట్ ఒక్కటీ ఆడలేదు. అయినప్పటికీ.. మూడో టీ20లో ఛాన్సిచ్చారు. మరోవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సంజు శాంసన్‌ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. ఇదీ టీమిండియా మేనేజ్‌మెంట్‌పై అభిమానులు విమర్శిస్తున్న తీరు.

Samayam Telugu 11 Nov 2019, 1:49 pm
బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో యువ వికెట్ రిషబ్ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. కీపింగ్‌లో వరుస తప్పిదాలతో విమర్శలు ఎదుర్కొన్న పంత్.. బ్యాటింగ్‌లో కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ షాట్ ఆడలేదు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లోనూ 9 బంతులాడిన పంత్ చేసిన పరుగులు 6 మాత్రమే. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేదు. సౌమ్య సర్కార్ విసిరిన స్ట్రైట్ డెలివరీని అడ్డంగా ఊపేసిన పంత్ క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో.. అతని టీ20 కెరీర్ ప్రశ్నార్థకంలో పడినట్లు కనిపిస్తోంది. రిజర్వ్ బెంచ్‌పై సంజు శాంసన్ లాంటి వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ ఉన్నా.. పంత్‌‌కి వరుసగా అవకాశాలివ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Samayam Telugu Nagpur: Indian batsman Rishabh Pant gets bowled out during the third T20 cricket...
Indian batsman Rishabh Pant gets bowled


Read More:undefined


మ్యాచ్‌లో తొలుత శ్రేయాస్ అయ్యర్ (62: 33 బంతుల్లో 3x4, 5x6), కేఎల్ రాహుల్ (52: 35 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ మహ్మద్ నయిమ్ (81: 48 బంతుల్లో 10x4, 2x6) నిలకడగా ఆడటంతో బంగ్లాదేశ్ గట్టి పోటీనిచ్చేలా కనిపించింది. కానీ.. భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ టీ20ల్లోనే బెస్ట్ గణాంకాలు 6/7 నమోదు చేయడంతో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది.

Read More: రోహిత్ శర్మ పవర్.. ‘ఒక్క మాట’తో బంగ్లా ఓటమి


వరల్డ్ కప్ తర్వాత మహేంద్రసింగ్ ధోనీని పూర్తిగా పక్కన పెట్టేసిన భారత సెలక్టర్లు రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలిచ్చారు. కానీ.. ఈ యువ వికెట్ కీపర్ వాటిని వినియోగించుకోలేకపోయాడు. దీంతో.. ఇప్పటికే టెస్టుల్లో అతడి స్థానాన్ని మళ్లీ సాహా భర్తీ చేయగా.. ఇక టీ20ల్లోనూ సంజు శాంసన్‌కి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. పంత్ దేశవాళీ క్రికెట్‌లో ఆడి మళ్లీ లయ అందుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కి ముందు ధోనీ ఇంటికి వెళ్లిన పంత్.. అక్కడ కీపింగ్, బ్యాటింగ్ గురించి ధోనీ వద్ద శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

undefined














తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.