యాప్నగరం

వరల్డ్ కప్ టికెట్లు హాట్ కేకుల్లా..

వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 తేదీల మధ్య జరగనున్న వరల్డ్ కప్ టికెట్ల అమ్మకం దాదాపు పూర్తయ్యింది. ఇంకా కేవలం 3500 టికెట్లు మాత్రమే మిగిలాయని ఐసీసీ తెలిపింది.

Samayam Telugu 28 Nov 2018, 6:19 pm
వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్ కప్ కోసం అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే టికెట్ల విక్రయం ప్రారంభం కాగా.. కేవలం 3500 టికెట్లు మాత్రమే మిగిలాయని బుధవారం ఐసీసీ తెలిపింది. యూకేలో మే 30 నుంచి జులై 14 మధ్య వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టికెట్ల అమ్మకం దాదాపు పూర్తయ్యిందని ఐసీసీ కమర్షియల్ విభాగం జనరల్ మేనేజర్ క్యాంప్‌బెల్ జేమిసన్ తెలిపారు.
Samayam Telugu world cup 2019


భారత్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడుపోయానని ఐసీసీ ప్రకటించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జూన్ 16న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ టికెట్లు కూడా అయిపోయాయని తెలిపింది. మే 30న ఓవల్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. జూలై 14న లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.