యాప్నగరం

ధోనీతో పోటీపడి గెలిచిన జీవా..!

ఆస్ట్రేలియాతో సిరీస్ ముగియడంతో ఇంటి దగ్గర వాలిపోయాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. కుటుంబ సభ్యులకి

TNN 15 Oct 2017, 3:12 pm
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగియడంతో ఇంటి దగ్గర వాలిపోయాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. కుటుంబ సభ్యులకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాననే కారణంతోనే మూడేళ్ల క్రితం టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఫినిషర్.. తీరిక దొరికితే చాలు తన గారాల పట్టి జీవాతో సరదాగా గడుపుతుంటాడు.
Samayam Telugu ms dhoni and ziva share besan ka ladoo
ధోనీతో పోటీపడి గెలిచిన జీవా..!


శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరగాల్సిన విజేత నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ ఔట్‌ఫీల్డ్ బురద కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1గా ముగిసింది. భారత్ జట్టు అక్టోబరు 22 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. దీంతో వారం రోజులు గ్యాప్ దొరకడంతో ప్రస్తుతం జీవాతో ఆడుకుంటున్న ధోనీ.. ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. లడ్డు తినేందుకు జీవా, ధోనీ పోటీపడగా.. ధోనీ కంటే.. జీవానే ఎక్కువ శాతం లడ్డుని కొరుక్కతినడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


  Attack on besan ka laddoo A post shared by @mahi7781 on Oct 14, 2017 at 11:25pm PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.