భారత్ జట్టుకి టీ20 కెప్టెన్గా ఎంపికైన కొద్దినెలలకే టీ20 ప్రపంచకప్.. నాలుగేళ్లలో కోట్లాది మంది అభిమానులు 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఐసీసీ మూడు టోర్నీల్లోనూ జట్టును విజేతగా నిలిపిన ఏకైక భారత్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. అయితే.. ఏ టోర్నీలో భారత్ విజేతగా నిలిచినా ఆటగాళ్లు అందరూ ట్రోఫీతో ముందు వరుసలో ఫొటోలకి ఫోజిలిస్తుంటే ధోనీ మాత్రం వెనక వరుసలో ఒక మూలన ఉండిపోతాడు. అది కెప్టెన్సీ హోదా ఉన్నా లేకపోయినా.. ధోనీ స్థానం అదేనట.
అంతర్జాతీయ క్రికెటర్గా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి టీమిండియా ప్రయాణించే బస్సులో కూడా ధోనీ కూర్చునేది వెనుక సీట్లోనేనట. తాజాగా వెస్టిండీస్తో మూడో వన్డే ముగిసిన అనంతరం టీమిండియా హోటల్కి వెళ్తుండగా శిఖర్ ధావన్ ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులోనూ ధోనీ చివరి సీట్లేనే కూర్చుని ఉన్నాడు. ఒకప్పుడు సీనియర్ క్రికెటర్లు.. సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో వెనక్కి వెళ్లిపోయిన ధోనీ ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడట. మైదానంలో వికెట్ల వెనుక ఉంటూ బ్యాట్స్మెన్ కదలికల్ని గమనించే ధోనీ.. బస్సులో కూడా అదే అలవాటు చేసుకున్నాడా..?
అంతర్జాతీయ క్రికెటర్గా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి టీమిండియా ప్రయాణించే బస్సులో కూడా ధోనీ కూర్చునేది వెనుక సీట్లోనేనట. తాజాగా వెస్టిండీస్తో మూడో వన్డే ముగిసిన అనంతరం టీమిండియా హోటల్కి వెళ్తుండగా శిఖర్ ధావన్ ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులోనూ ధోనీ చివరి సీట్లేనే కూర్చుని ఉన్నాడు. ఒకప్పుడు సీనియర్ క్రికెటర్లు.. సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో వెనక్కి వెళ్లిపోయిన ధోనీ ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడట. మైదానంలో వికెట్ల వెనుక ఉంటూ బ్యాట్స్మెన్ కదలికల్ని గమనించే ధోనీ.. బస్సులో కూడా అదే అలవాటు చేసుకున్నాడా..?