యాప్నగరం

ధోనీని అడగండి..నన్ను మధ్యలోకి లాగొద్దు..?

భారత్ జట్టుకి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి సహనం కోల్పోయాడు

TNN 22 Aug 2017, 5:43 pm
భారత్ జట్టుకి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి సహనం కోల్పోయాడు. ఓ అభిమానిపై సోషల్ మీడియాలో వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. అసలు ఏం జరిగిందంటే..? ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చాలా రోజులు ప్రచారకర్తగా పనిచేశాడు. అయితే.. ఆ సంస్థ దివాళా తీసినట్లు వార్తలు రావడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతూ.. మహేంద్రసింగ్ ధోనీతో పాటు హర్భజన్‌ సింగ్‌ని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారు. తప్పుడు వాగ్దానాలు చేసి మోసం చేశారని దుయ్యబట్టారు.
Samayam Telugu ms dhoni harbhajan singh face backlash from real estate buyers on twitter
ధోనీని అడగండి..నన్ను మధ్యలోకి లాగొద్దు..?


ఒక కొనుగోలుదారుడైతే.. 2011 ప్రపంచకప్ నెగ్గిన భారత్ జట్టుకి అమ్రాపాల్ సంస్థ ఒక్కో విల్లాని అప్పట్లో ఉచితంగా ప్రకటించిందని.. క్రికెటర్లు కూడా వాటిని తీసుకున్నారని ఆరోపించాడు. దీనికి ధోనీ మిన్నకుండిపోయినా.. హర్భజన్ సింగ్ మాత్రం సమాధానమిచ్చాడు. తాను ఎలాంటి విల్లా తీసుకోలేదని.. క్రికెటర్లందరినీ కూడా ఆ సంస్థ మోసం చేసిందని ట్వీట్ చేశాడు. అయితే.. దీనిపై మరో కొనుగోలుదారుడు ‘ధోనీకి అమ్రాపాలి సంస్థ యజమాని మంచి ఫ్రెండ్. కాబట్టి ఈ సమయంలో హర్భజన్ సింగ్ మాటల్ని కూడా నమ్మలేం’ అని ట్వీట్ చేశాడు. దీంతో భజ్జీ.. ఫైర్ అయిపోయాడు. ‘ఆ సంస్థ యజమాని ధోనీకి ఫ్రెండ్ కావొచ్చు. కానీ.. నాకు మాత్రం కాదు. కాబట్టి నువ్వు ధోనీనే అడగటం మంచిది. కొంచెం బుర్రవాడు’ అని ఘాటుగా బదులిచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.