యాప్నగరం

ధోనీలా కోహ్లీకి సాయపడేదెవరు..?: గవాస్కర్

ధోనీ.. జట్టులో ఉంటే.. చిన్న చిన్న ఫీల్డింగ్ మార్పులు, బౌలర్లతో హిందీలో మాట్లాడుతూ సూచనలు చేయడం, వారు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వెంటనే వికెట్ల వెనుక నుంచే హెచ్చరించడం లాంటి పనులు చక్కబెట్టేస్తాడు.

Samayam Telugu 30 Oct 2018, 11:48 am
ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో ధోనీ ఆడటం భారత్ జట్టుకి అవసరమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ల కోసం జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. ధోనీపై వేటు వేసి అతని స్థానంలో రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. వన్డేల్లోనూ ధోనీపై వేటు పడబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. 2019 ప్రపంచకప్‌లోనూ ఈ మాజీ కెప్టెన్ ఆడటం అనుమానమేనంటూ రూమర్స్‌ వినిపించాయి. అయితే.. ప్రపంచకప్‌లో ధోనీ ఆడటం వల్ల లాభపడేది భారత్ జట్టేకాదు.. కెప్టెన్ కోహ్లీ కూడా అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
Samayam Telugu Kohli-Dhoni.


‘ప్రపంచకప్‌లో ధోనీ అవసరం విరాట్ కోహ్లి చాలా ఉంది. ఎందుకంటే.. 50 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతి అంశాన్ని కెప్టెన్‌ చూసుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ ధోనీ.. జట్టులో ఉంటే.. చిన్న చిన్న ఫీల్డింగ్ మార్పులు, బౌలర్లతో హిందీలో మాట్లాడుతూ సూచనలు చేయడం, వారు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వెంటనే వికెట్ల వెనుక నుంచే హెచ్చరించడం లాంటి పనులు కెప్టెన్‌ కోహ్లీతో సంబంధం లేకుండా వేగంగా చక్కబెట్టేస్తాడు. ప్రపంచకప్‌‌లో ఇది కచ్చితంగా విరాట్ కోహ్లీకి కలిసొచ్చే అంశం. ధోనీ లేకపోతే.. ఆ పనులు జట్టులో ఎవరు చేయగలరు..? ’ అని గవాస్కర్ ప్రశ్నించాడు.

భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురం వేదికగా గురువారం ఐదో వన్డే జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.