యాప్నగరం

ధోనీపై ప్రశంసలు కురిపించిన షోయబ్ మాలిక్

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై సానియా భర్త షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించాడు. ధోని గురించి మీరేమని అనుకుంటున్నారో చెప్పండని అడగ్గా..

TNN 15 Sep 2017, 2:55 pm
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించాడు. ధోనీ గురించి మీరేం చెబుతారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ హైదరాబాద్ అల్లుడు బదులిస్తూ.. ‘లెజెండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైం’ అని ట్వీట్ చేశాడు. మాలిక్ ఇచ్చిన రిప్లయ్ చూసి మహీ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. వరల్డ్ ఎలెవన్‌తో తలపడుతున్న పాకిస్థాన్ జట్టులో సభ్యుడిగా ఉన్న మాలిక్ గురువారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ధోనీ గురించి ఏదైనా చెప్పండని అడగ్గా.. షోయబ్ పై విధంగా స్పందించాడు.
Samayam Telugu ms dhoni is goat shoaib malik praises mahi
ధోనీపై ప్రశంసలు కురిపించిన షోయబ్ మాలిక్


ఇండిపెండెన్స్ కప్‌లో భాగంగా వరల్డ్ ఎలెవన్‌తో జరిగిన తొలి టీ20లో 38 రన్స్ చేసిన మాలిక్, రెండో టీ20లో 39 పరుగులు చేశాడు. 88 మ్యాచ్‌ల్లో 1702 పరుగులు చేసిన మాలిక్.. పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెండన్ మెక్‌కల్లమ్, తిలకరత్నే దిల్షాన్, విరాట్ కోహ్లి, మార్టిన్ గప్టిల్, మహ్మద్ షెహజాద్‌లు మాలిక్ కంటే ముందున్నారు.

Legend GOAT — Shoaib Malik (@realshoaibmalik) September 14, 2017
పాకిస్థాన్‌లో 8 ఏళ్ల తర్వాత క్రికెట్ మ్యాచ్‌‌లను నిర్వహిస్తున్నారు. వరల్డ్ ఎలెవన్ జట్టు అక్కడ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో పాక్ విజయం సాధించగా, రెండో టీ20లో వరల్డ్ఎలెవన్ విజయం సాధించింది. వరల్డ్ ఎలెవన్ తరఫున ధోనీ, కోహ్లి ఆడితే బాగుండేదని పాక్ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.