యాప్నగరం

MS Dhoni: నలభీమ అవతారం (వీడియో)

మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ త‌న‌లోని విభిన్న క‌ళ‌ల‌ను అభిమానుల‌కు ప‌రిచయం చేశాడు. తాజాగా ధోనీకి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైర‌లైంది.

Samayam Telugu 5 Feb 2020, 10:47 pm
టీమిండియా నుంచి ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. త‌న‌కు ల‌భించిన విరామాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నాడు. తాజాగా మాల్దీవుల ప‌ర్య‌ట‌నకు వెళ్లిన ధోనీ.. త‌న‌లోని పాక‌శాస్త్ర నిపుణుడిని నిద్ర‌లేపాడు. ఈక్ర‌మంలో పానీపూరిని తయారు చేసి, హాట్‌హాట్‌గా స‌హ‌చ‌ర క్రికెటర్ల‌కు అందించాడు. ఈ త‌తంగాన్నంతా ఎవ‌రో వీడియో తీసి నెట్‌లో పెట్ట‌గా.. క్ష‌ణాల్లో వైర‌లైంది. అభిమానులు ఫన్నీ కామెంట్లు, లైకులతో త‌మ స్పంద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.
Samayam Telugu Mumbai: Indian cricketer Mahendra Singh Dhoni at the launch of Panerai watches i...
Dhoni


Read Also: పానీ పూరి అమ్మే స్థాయి నుంచి.. ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్ దాకా.. క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ సక్సెస్ స్టోరీ
ఇంత‌కీ ఈ వీడియోలో ఏముందంటే.. నీట్‌గా త‌యారైన ధోనీ.. పానీపూరి స్టాల్ వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డే ఉన్న వివిధ పదార్థాల‌తో క‌లిపి, పానీపూరిని త‌యారుచేశాడు. ఆ ప‌క్క‌నే ఉన్న మాజీ క్రికెట‌ర్లు ఆర్పీ సింగ్‌, పీయూష్ చావ్లా వాటిని త‌మ ప్లేటులో వేసుకున్నారు. సోష‌ల్ మీడియాలోని ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌లైంది.


మ‌రోవైపు గతేడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత జ‌ట్టుకు దూర‌మైన ధోనీ.. టీమిండియాలో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడో అని అత‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మెగాటోర్నీ అనంత‌రం గ‌త ఆరునెల‌ల్లో కొంత‌కాలం సైన్యంలో సేవ‌లందించిన ధోనీ.. త‌ర్వాత ప్రైవేటు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు. తాను రాబోయే ఐపీఎల్‌లో బ‌రిలోకి దిగుతాడు. మ‌రోవైపు బీసీసీఐ క్రికెట్ స‌ల‌హా మండ‌లి (సీఏసీ)లోకి తాజాగా ఆర్పీ సింగ్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

Read Also: భారత్‌కు మరో ఎదురుదెబ్బ‌.. ఐసీసీ మ‌ళ్లీ కొర‌డా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.