యాప్నగరం

ధోనీ.. ఇక ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్

భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఆ రాష్ట్ర అభివృద్ధికి తనవంతు సహకారం అందిచనున్నాడు.

TNN 26 Nov 2016, 8:55 am
భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధిలో ధోనీ కూడా భాగస్వామి కానున్నాడు. ఇంతకూ అది ఏ రాష్ట్రమో కాదు. ఆయన సొంత గడ్డ జార్ఖండ్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ నిర్వహించనున్న తొలి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ కోసం ధోనీ ప్రచారం చేయనున్నాడు. ధోనీతో ఇప్పటికే వాణిజ్య ప్రకటనను రూపొందించామని, దాన్ని వచ్చే నెల నుంచి టీవీల్లో ప్రసారం చేస్తామని జార్ఖండ్ పరిశ్రమల కార్యదర్శి సునీల్ కుమార్ బర్నవాల్ తెలిపారు. జార్ఖండ్‌లో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రం వెనుకబడి ఉంది.
Samayam Telugu ms dhoni new brand ambassador of jharkhand
ధోనీ.. ఇక ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్


జార్ఖండ్‌ను దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించనున్నారు. బిహార్లో భాగంగా ఉన్న జార్ఖండ్ 2000 సంవత్సరంలో నూతన రాష్ట్రంగా ఏర్పడింది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆ రాష్ట్రానికి ఇప్పటి వరకూ బ్రాండ్ అంబాసిడర్ ఎవరూ లేరు. సర్వ శిక్ష అభియాన్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ధోనీ ప్రచారం చేయనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.