యాప్నగరం

పద్మభూషణ్ కోసం ధోనీ పేరు సిఫార్సు

దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరుని

TNN 20 Sep 2017, 2:08 pm
దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరుని బీసీసీఐ బుధవారం సిఫార్సు చేసింది. ఇటీవల 300 వన్డేల మైలురాయిని అందుకున్న ధోనీ.. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 100 వన్డే అర్ధశతకాలు, 101 స్టంపౌట్స్‌తో అరుదైన రికార్డులను నెలకొల్పాడు. కెప్టెన్‌గా కూడా భారత్‌కి 2007లో టీ20 ప్రపంచకప్, 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని అందించి విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. నాలుగేళ్ల క్రితం టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడుతూ బిజీగా ఉన్నాడు.
Samayam Telugu ms dhoni nominated for padma bhushan award by bcci
పద్మభూషణ్ కోసం ధోనీ పేరు సిఫార్సు


‘మహేంద్రసింగ్ ధోనీ పేరుని పద్మభూషణ్ కోసం బీసీసీఐ సిఫార్సు చేసింది. సభ్యులందరూ ధోనీ పేరుని ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ కంటే మెరుగైన క్రికెటర్ భారత్‌లో ఇక ఎవరు ఉంటారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కెరీర్‌లో 302 వన్డేలు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల ధోనీ.. 9,737 పరుగులు చేయగా.. 90 టెస్టుల్లో 4,876 పరుగులు, 78 టీ20ల్లో 1,212 రన్స్ చేశాడు. ఇందులో 6 టెస్టు శతకాలు, 10 వన్డే శతకాలు ధోనీ ఖాతాలో ఉన్నాయి. పద్మ అవార్డ్స్ కోసం ఎవరి పేరునీ బీసీసీఐ ఈ ఏడాది సిఫార్సు చేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.