యాప్నగరం

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న ధోనీ..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ అవార్డు

Samayam Telugu 3 Apr 2018, 9:57 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కల్నల్‌ దుస్తుల్లో హాజరైన ధోనీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డుని స్వీకరించారు. భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో క్రికెటర్‌గా ధోనీ నిలిచారు.
Samayam Telugu 30


భారత్‌కి 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ని 2011, ఏప్రిల్ 2న అందించిన ధోనీ.. మళ్లీ అదే రోజున పద్మభూషణ్ అవార్డుని అందుకోవడం విశేషం. ఈ ప్రపంచకప్‌లోనే ధోనీ అద్వితీయ ప్రదర్శనకి మెచ్చిన భారత ప్రభుత్వం ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) హోదా ఇచ్చిన విషయం తెలిసిందే.

ధోనీతో పాటు ప్రపంచ ఛాంపియన్, స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వాణీ కూడా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006, 2010లో భారత్‌కు బంగారు పతకాలను అందించడంతో పాటు కెరీర్‌లో మొత్తం 19 సార్లు ప్రపంచ టైటిల్స్‌ని అడ్వాణీ గెలుపొందాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.