యాప్నగరం

అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ధోనీ!

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

TNN 17 Mar 2017, 1:19 pm
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ధోనీ సహా ఝార్ఖండ్ క్రికెట్ జట్టు సభ్యులంతా బస చేసిన ఢిల్లీలోని ద్వారకాలో ఉన్న వెల్‌కం హోటల్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ అగ్నిప్రమాదం నుంచి ధోనీ సహా మిగిలిన క్రికెటర్లతంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు గంటన్నర పాటు కష్టపడిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేశారు.
Samayam Telugu ms dhoni rescued safely from hotel fire in dwarka delhi
అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ధోనీ!


కాగా, విజయ్ హజారే టోర్నమెంట్‌లో భాగంగా ధోనీ సారథ్యంలోని ఝార్ఖండ్ జట్టు గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటోంది. వాస్తవానికి ఈరోజు ఝార్ఖండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. హోటల్‌లో జరిగిన అగ్నప్రమాదంలో ఝార్ఖండ్ జట్టు కిట్ ధ్వంసమవడంతో మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు. బుధవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఝార్ఖండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్ జట్టుకి అనధికారిక సలహాదారుడిగా వ్యవహరించిన ఎం.ఎస్. ధోనీ.. విజయ్ హజారే ట్రోఫీకి మాత్రం జట్టులో చేరాడు. తనే ముందుండి జట్టుని విజయపథంలో నడిపిస్తున్నాడు.

అగ్నిప్రమాదం జరిగిన ద్వారకాలోని వెల్‌కం హోటల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.