యాప్నగరం

13 ఏళ్ల తర్వాత మళ్లీ రైలెక్కిన ధోనీ..

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 13 ఏళ్ల తర్వాత మళ్లీ రైలెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించనున్న..

TNN 22 Feb 2017, 1:03 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 13 ఏళ్ల తర్వాత మళ్లీ రైలెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించనున్న ధోనీ.. తన జట్టు సభ్యులతో కలిసి రైల్లో కోల్‌కతా వెళ్లాడు. ఏసీ ఫస్ట్ టైర్లో జార్ఖండ్ టీం హతియా నుంచి హౌరా వరకు 300 కి.మీ దూరం ప్రయాణించింది. సుదీర్ఘ కాలం తర్వాత రైల్లో వెళ్లిన ధోనీ ఈ ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదించినట్లుగా కనిపించాడు. ఈ విషయాలను ధోనీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Samayam Telugu ms dhoni travels by train after 13 years
13 ఏళ్ల తర్వాత మళ్లీ రైలెక్కిన ధోనీ..


ఫిబ్రవరి 23 నుంచి కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడనుండగా.. ధోనీ నాయకత్వంలోని జార్ఖండ్ జట్టు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 25న కోల్‌కతాతో తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది. గత సీజన్లోనూ ధోనీ జార్ఖండ్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడినప్పటికీ కెప్టెన్‌గా మాత్రం వ్యవహరించలేదు.

  A post shared by @mahi7781 on Feb 21, 2017 at 6:08pm PST
ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ధోనీ.. సాధారణ ఆటగాడిగా మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లోనూ పుణే జట్టు కెప్టెన్‌గా ధోనీ వైదొలిగిన విషయం విదితమే.


కెప్టెన్‌గా భారత జట్టుకు తిరుగులేని విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ.. రైలు ప్రయాణం వార్త తెలుసుకున్న అభిమానులు.. రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం మీదకు భారీగా చేరుకొని కెప్టెన్ కూల్‌ను దగ్గర నుంచి చూసేందుకు ఆసక్తి చూపారు. ధోనీ గతంలో టికెట్ కలెక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.