యాప్నగరం

బిషప్ దశాబ్దాపు వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీ.. మరో ఇద్దరికీ ఛాన్స్

ధోనీ గత 10 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నా.. బిషప్ తన దశాబ్దపు వన్డే టీమ్‌ కెప్టెన్‌గా అతడ్ని ఎంపిక చేశాడు. ధోనీనే కాదు.. రెండేళ్ల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్, నిషేధంలో ఉన్న షకీబ్‌కి కూడా అందులో చోటు లభించింది.

Samayam Telugu 27 May 2020, 3:28 pm
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్‌ ఎంపిక చేసిన దశాబ్దాపు వన్డే జట్టు కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ ఎంపికయ్యాడు. తన జట్టులో మొత్తం ముగ్గురు భారత క్రికెటర్లకి అవకాశమిచ్చిన బిషప్.. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాని మాత్రం పక్కన పెట్టాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? ఆ జట్టులో కనీసం ఒక్క వెస్టిండీస్ క్రికెటర్‌, ఇంగ్లాండ్, పాకిస్థాన్ క్రికెటర్‌కి కూడా చోటు దక్కలేదు.
Samayam Telugu MS Dhoni, Rohit Sharma, Virat Kohli


Read More: undefined

ఇయాన్ బిషప్ దశాబ్దాపు వన్డే జట్టు ఇదే: రోహిత్ శర్మ (భారత్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (భారత్), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్), షకీమ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్)

Read More: undefined

2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఎంపిక చేసిన బిషప్.. అతనికి జోడీగా ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ని సెలెక్ట్ చేశాడు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఏబీ డివిలియర్స్, రాస్‌టేలర్‌తో మిడిలార్డర్‌ని సమతూకంగా ఉంచుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో షకీమ్ ఎంపికవగా.. కీపర్, కెప్టెన్‌గా ధోనీ ఏడో స్థానంలో టీమ్‌లో‌‌‌కి సెలక్ట్‌ అయ్యాడు. బౌలింగ్ విభాగాన్ని మిచెల్ స్టార్క్, డేల్ స్టెయిన్, లసిత్ మలింగాతో నింపేసిన బిషప్.. ప్రొఫెషనల్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి స్పిన్ బాధ్యతలు అప్పగించాడు. షకీబ్ కూడా స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.