యాప్నగరం

చివర్లో ధోనీ భలే గేర్ మార్చాడు: పాండే

దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బాదిన అర్ధశతకంపై

TNN 22 Feb 2018, 12:18 pm
దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బాదిన అర్ధశతకంపై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో మనీశ్ పాండే (79 నాటౌట్: 48 బంతుల్లో 6x4, 2x6)తో కలిసి ధోనీ (52 నాటౌట్: 28 బంతుల్లో 4x4, 3x6) ఐదో వికెట్‌కి అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగలిగింది.
Samayam Telugu ms dhoni woke up in the last 5 overs and hit some great shots says manish pandey
చివర్లో ధోనీ భలే గేర్ మార్చాడు: పాండే


కెరీర్‌లో రెండో టీ20 శతకం సాధించిన ధోనీ.. స్లాగ్ ఓవర్లలో దూకుడుగా ఆడటంతో భారత్ చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 64 పరుగులు రాబట్టగలిగింది. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేసిన పీటర్సన్ బౌలింగ్‌లో ధోనీ వరుసగా 6, 4, 4 బాదేసి 18 పరుగులు రాబట్టాడు. అంతకముందు ఓవర్‌ వేసిన క్రిస్‌ మోరీస్ కూడా ధోనీ ధాటికి 13 పరుగులిచ్చుకున్నాడు. అయితే.. లక్ష్యాన్ని క్లాసెన్ (69: 30 బంతుల్లో 3x4, 7x6), కెప్టెన్ డుమిని (64: 40 బంతుల్లో 4x4, 3x6) దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలోనే 189/4తో అలవోకగా ఛేదించేసింది. విజేత నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది.

మ్యాచ్ అనంతరం మనీశ్ పాండే మీడియాతో మాట్లాడుతూ ‘మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టచ్‌లోకి వచ్చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు మ్యాచ్‌లో చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. దీంతో ధోనీ కూడా కొన్ని షాట్లు ఆడేందుకు తొలుత ఇబ్బందిపడ్డాడు. రెండు బంతులు అతని బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి వెళ్లినా.. అవి లక్కీగా బౌండరీ లైన్‌ని తాకాయి. అయితే.. చివరి ఐదు ఓవర్లలో మాత్రం ధోనీ అద్భుతమైన షాట్లు ఆడాడు. అతని దూకుడుతోనే భారత్ 188 పరుగులు చేయగలిగింది. 2009 ఐపీఎల్ సీజన్‌లో సెంచూరియన్ వేదికగానే తొలి శతకం బాదిన విషయం నాకు ఇంకా గుర్తుంది. మళ్లీ ఇదే వేదికపై అర్ధశతకం సాధించడం ఆనందంగా ఉంది’ అని మనీశ్ పాండే వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.