యాప్నగరం

ఫైవ్ స్టార్ హోటల్లో ధోనీ ఫోన్లు చోరీ..

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన 3 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో జార్ఖండ్ జట్టు బస చేసిన సమయంలో

TNN 19 Mar 2017, 11:03 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన 3 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో జార్ఖండ్ జట్టు బస చేసిన సమయంలో ఈ ఫోన్లు మాయమయ్యాయి. ధోనీ సహా జార్ఖండ్ క్రికెట్ జట్టు సభ్యులంతా ఢిల్లీలోని ద్వారకలో ఉన్న వెల్‌కం హోటల్‌లో బస చేయగా.. శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి క్రికెటర్లంతా సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆ సమయంలో ధోనీ ఫోన్లను ఎవరో దొంగిలించారు.
Samayam Telugu ms dhonis mobile phones stolen delhi police registers fir
ఫైవ్ స్టార్ హోటల్లో ధోనీ ఫోన్లు చోరీ..


మహీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్లో బెంగాల్‌లో తలపడేందుకు జార్ఖండ్ జట్టు ఢిల్లీ వెళ్లగా.. ధోనీ సేన వెల్‌కమ్ హోటల్లోని ఏడో అంతస్థులో బస చేసింది. ఫస్ట్ ప్లోర్‌లో మంటలు తలెత్తగా, పొగ రావడాన్ని గమనించిన క్రికెటర్లు తమ గదులను ఖాళీ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.

సెమీఫైనల్ మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేయగా.. బెంగాల్ జట్టు 41 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన ధోనీ 62 బంతుల్లో 70 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో నిరాశపర్చడంతోపాటు బ్యాటింగ్‌లోనూ 38 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడంతో ధోనీ టీం సెమీస్‌లో ఓటమిపాలైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.