యాప్నగరం

సిరీస్‌లో భారత్‌కి తిరుగుండదు: ఎమ్మెస్కే

ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌ని టీమిండియా తప్పకుండా గెలుస్తుందని

TNN 13 Sep 2017, 6:10 pm
ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌ని టీమిండియా తప్పకుండా గెలుస్తుందని భారత జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం కోసం తాజాగా తిరుమలకి వచ్చిన ఎమ్మెస్కే మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉందని.. కెప్టెన్ కోహ్లి, ధోనీ ఫామ్‌‌లో ఉండటం సిరీస్‌లో భారత్‌కి కలిసొస్తుందని ఆయన వివరించారు.
Samayam Telugu msk prasad confidentteam india will bag series against australia
సిరీస్‌లో భారత్‌కి తిరుగుండదు: ఎమ్మెస్కే


‘భారత జట్టు గత కొంతకాలంగా అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణిస్తోంది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన సిరీస్‌లో కెప్టెన్ కోహ్లి వరుస శతకాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉండటం, సీనియర్ బ్యాట్స్‌మెన్ ధోనీ అనుభవం ఈ సిరీస్‌లో భారత్‌కి లాభించనుంది. ప్రస్తుతం సమతూకంగా ఉన్న భారత్ జట్టు ఐదు వన్డేల ఈ వన్డే సిరీస్‌ని కూడా తప్పకుండా కైవసం చేసుకుంటుంది’ అని ఎమ్మెస్కే విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఆస్ట్రేలియాతో చెపాక్ స్టేడియంలో భారత్ తొలి వన్డేలో ఢీకొననుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.