యాప్నగరం

ధోనీ, యువీలు మళ్లీ దొరకలేదు: ఎమ్మెస్కే

టీమిండియాకి ధోనీ దూరమైన తర్వాత అతని విలువ ఏంటో..? టీమ్‌కి తెలిసింది. అలానే యువీ స్థానాన్ని భర్తీ చేయడానికీ భారత సెలక్టర్లకి దాదాపు మూడేళ్లు పట్టింది. ప్రస్తుతానికి శ్రేయాస్ అయ్యర్ ఆ స్థానంలో ఒకే.. కానీ.. ఇంకా అతని సామర్థ్యంపై సందేహాలెన్నో..!

Samayam Telugu 7 Mar 2020, 9:30 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ స్థానాల్ని టీమిండియాలో తాము భర్తీ చేయలేకపోయామని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల పదవీకాలం ముగియడంతో చీఫ్ సెలక్టర్ బాధ్యతల నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ తప్పుకోగా.. అతని స్థానంలో కర్ణాటకకి చెందిన సునీల్ జోషి ఎంపికైన విషయం తెలిసిందే. సెలక్టర్, చీఫ్ సెలక్టర్‌గా సుదీర్ఘకాలం ఉన్నప్పటికీ.. ధోనీ, యువీ స్థానాల్ని భర్తీ చేయలేకపోయామనే లోటు ఉండిపోయిందని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.
Samayam Telugu MS Dhoni and Yuvraj Singh


‘భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్‌ దిగ్గజ స్థాయి ఆటగాళ్లు. వారి స్థానాల్ని టీమ్‌లో భర్తీ చేసే ఆటగాళ్లు అంత సులువుగా దొరుకుతారని నేను అనుకోవడం లేదు. ఒక చీఫ్ సెలక్టర్‌గా నా ప్రాథమిక బాధ్యత టాలెంట్ ఉన్న ఆటగాళ్లని గుర్తించడం.. వారికి తగిన అవకాశాల్ని ఇస్తూ ప్రోత్సహించడం. అదే నేను నిర్వర్తించాను’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు.

2019 వన్డే ప్రపంచకప్‌కి భారత్ జట్టు ఎంపిక సమయంలో అంబటి రాయుడ్ని పక్కన పెట్టడంపై అప్పట్లో ఎమ్మెస్కే ప్రసాద్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నెం.4 ఆటగాడ్ని గుర్తించడంలోనూ భారత సెలక్టర్లు విఫలమయ్యారని గణాంకాలు చెప్తున్నాయి. అయితే.. ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతల్ని సజావుగా కోహ్లీకి అప్పగించడంలో ఎమ్మెస్కే చతురతకి అప్పట్లో ప్రశంసలు దక్కాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.