టీ20 వరల్డ్కప్ ముంగిట టీ20 కెప్టెన్సీని వదిలేయబోతున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు గురువారం సాయంత్రం కోహ్లీ ప్రకటించాడు. అయితే.. కోహ్లీ ఈ అనూహ్య నిర్ణయం వెనుక కారణమేంటి..? అని నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికరమైన కారణాన్ని వెలుగులోకి తెచ్చాడు. ‘‘టీ20 వరల్డ్కప్ ముంగిట విరాట్ కోహ్లీ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. బహుశా అతనిపై బయో- సెక్యూర్ బబుల్ వాతావరణం ఎక్కువగా ప్రభావం చూపించి ఉండొచ్చు. కోహ్లీ ఒక దశాబ్దకాలంలో 70 సెంచరీలు (43 వన్డేలు, 27 టెస్టులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రమాణాల్ని అతను నెలకొల్పాడు. కానీ.. గత ఏడాదన్నరకాలంగా బయో- సెక్యూర్ బబుల్ వాతావరణం అతని వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపింది. అందుకే.. టీ20 వరల్డ్కప్ ముంగిట.. కాస్త బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు’’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.
2014లో మహేంద్రసింగ్ ధోని నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ఆ తర్వాత 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీని కూడా అందుకుని పూర్తి స్థాయి కెెప్టెన్గా మారాడు. కానీ.. కెప్టెన్గా తొలిసారి టీ20 వరల్డ్కప్లో జట్టుని నడిపించబోతున్న కోహ్లీ.. ఆ మెగా టోర్నీ ముగిసిన తర్వాత పగ్గాలు వదిలేయబోతుండటం గమనార్హం. కోహ్లీ చివరిగా 2019, నవంబరులో ఇంటర్నేషనల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఈ ఏడాదన్నరకాలంగా.. మళ్లీ మూడంకెల స్కోరుని ఏ ఫార్మాట్లోనూ అతను అందుకోలేదు.
2014లో మహేంద్రసింగ్ ధోని నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ఆ తర్వాత 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీని కూడా అందుకుని పూర్తి స్థాయి కెెప్టెన్గా మారాడు. కానీ.. కెప్టెన్గా తొలిసారి టీ20 వరల్డ్కప్లో జట్టుని నడిపించబోతున్న కోహ్లీ.. ఆ మెగా టోర్నీ ముగిసిన తర్వాత పగ్గాలు వదిలేయబోతుండటం గమనార్హం. కోహ్లీ చివరిగా 2019, నవంబరులో ఇంటర్నేషనల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఈ ఏడాదన్నరకాలంగా.. మళ్లీ మూడంకెల స్కోరుని ఏ ఫార్మాట్లోనూ అతను అందుకోలేదు.