యాప్నగరం

Ranji Trophy ఫైనల్లో మధ్యప్రదేశ్ 368/3.. ఒత్తిడిలో ముంబయి

Madhya Pradesh vs Mumbai Final మ్యాచ్ ఆసక్తిగా మారిపోయింది. ముంబయి టీమ్‌లో గురువారం సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ నమోదు చేయగా.. శుక్రవారం మధ్యప్రదేశ్ టీమ్‌లో ఇద్దరు బ్యాటర్లు శతకాలు సాధించారు. దాంతో?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 24 Jun 2022, 5:44 pm

ప్రధానాంశాలు:

  • బెంగళూరులో ఆసక్తిగా మారిన రంజీ ట్రోఫీ ఫైనల్
  • ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గురువారం శతకం
  • శుక్రవారం మధ్యప్రదేశ్ టీమ్‌లో రెండు శతకాలు నమోదు
  • ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్న గేమ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ranji Trophy Final (Pic Credit: BCCI Twitter)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2021-22 ఫైనల్లో మధ్యప్రదేశ్ ఎవరూ ఊహించని విధంగా మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. గత బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ 374 పరుగులకి ఆలౌటవగా.. మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ 368/3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రజత్ పాటిదార్ (67 బ్యాటింగ్: 106 బంతుల్లో 13x4), ఆదిత్య శ్రీవాత్సవ (11 బ్యాటింగ్: 33 బంతుల్లో 1x4) ఉండగా.. మధ్యప్రదేశ్ 6 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్ టీమ్‌లో ఈరోజు ఓపెనర్ యశ్ దూబె (133: 336 బంతుల్లో 14x4), శుభమ్ ఎస్ శర్మ (116: 215 బంతుల్లో 15x4, 1x6) సెంచరీలు నమోదు చేశారు. రెండో వికెట్‌కి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ.. ముంబయి బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అయితే.. శతకం తర్వాత శర్మ ఔటైపోగా.. రజత్ పాటిదార్‌తో కలిసి మధ్యప్రదేశ్ టీమ్ స్కోరు 300 దాటించిన దుబే 133 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ చేజార్చుకున్నాడు.

మ్యాచ్‌లో ఇక రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండగా.. మధ్యప్రదేశ్ టీమ్ శనివారం తొలి సెషన్‌లో డిక్లేర్ చేసే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం కేవలం 6 పరుగుల ఆధిక్యంలో ఆ టీమ్ ఉండగా.. కనీసం 500+ స్కోరు చేయాలని ఆ టీమ్ ఆశిస్తోంది. అదే జరిగితే? మ్యాచ్‌లో ఫలితం తేలడం కూడా అనుమానమే. పిచ్ శుక్రవారం బ్యాటింగ్‌కి చాలా అనుకూలంగా కనిపించింది. శనివారం కూడా బ్యాటర్లకి సహకరిస్తే? మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.