ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక న్యూజిలాండ్కి 540 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. మ్యాచ్లో మూడో రోజైన ఆదివారం ఓవర్నైట్ స్కోరు 69/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు.. మయాంక్ అగర్వాల్ (62), చతేశ్వర్ పుజారా (47), శుభమన్ గిల్ (47), అక్షర్ పటేల్ (41 నాటౌట్: 26 బంతుల్లో 3x4, 4x6) దూకుడుగా ఆడటంతో రెండో సెషన్లో 276/7తో డిక్లేర్ చేసింది. దాంతో.. భారత్కి తొలి ఇన్నింగ్స్లో లభించిన 263 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 540 పరుగుల టార్గెట్ కివీస్ ముందు నిలిచింది. ఈరోజు తొలి సెషన్లో దూకుడుగా ఆడిన మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ తర్వాత ఔటవగా.. అనంతరం వచ్చిన శుభమన్ గిల్తో పాటు పుజారా సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ అర్ధశతకం ముంగిట ఔటైపోయారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయమే తీసుకున్నా.. శ్రేయాస్ అయ్యర్ (14: 8 బంతుల్లో 6x4), సాహా (13: 12 బంతుల్లో 2x4) దూకుడుగా ఆడేశారు. అలానే అక్షర్ పటేల్ కూడా టీ20 తరహా హిట్టింగ్తో చెలరేగడంతో.. భారత్ భారీ ఆధిక్యాన్ని అందుకోగలిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా.. మరో స్పిన్నర్ రచిన్ రవీంద్ర మూడు వికెట్లు తీశాడు.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150: 311 బంతుల్లో 17x4, 4x6) శతకం నమోదు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఎవరూ ఊహించనిరీతిలో 62 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఏకంగా 9 మంది బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవగా.. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు, సిరాజ్ మూడు, అక్షర్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. దాంతో.. భారత్ జట్టుకీ 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150: 311 బంతుల్లో 17x4, 4x6) శతకం నమోదు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఎవరూ ఊహించనిరీతిలో 62 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఏకంగా 9 మంది బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవగా.. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు, సిరాజ్ మూడు, అక్షర్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. దాంతో.. భారత్ జట్టుకీ 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.