యాప్నగరం

భారత జట్టులోకి కోహ్లీని నేను వద్దన్నానా..?

విరాట్ కోహ్లీని భారత జట్టులోకి 2008లో ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించిన మాట అవాస్తవమని బీసీసీఐ మాజీ

TNN 10 Mar 2018, 10:37 am
విరాట్ కోహ్లీని భారత జట్టులోకి 2008లో ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించిన మాట అవాస్తవమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ వెల్లడించాడు. రెండు రోజుల క్రితం టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లిని జట్టులోకి ఎంపిక చేయడం అప్పట్లో బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌తో పాటు మహేంద్రసింగ్ ధోని, కోచ్ గ్యారీ కిరిస్టన్‌కి ఇష్టంలేదని.. వారు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, తమిళనాడుకి చెందిన బద్రీనాథ్‌ని జట్టులోకి తీసుకోవాలని పట్టుబట్టినట్లు చెప్పాడు. వారి ప్రతిపాదనని లెక్క చేయకుండా కోహ్లీకి
Samayam Telugu n srinivasan retorts dilip vengsarkars claims on virat kohlis selection
భారత జట్టులోకి కోహ్లీని నేను వద్దన్నానా..?

అవకాశమిచ్చినందుకు తనని చీఫ్ సెలక్టర్ పదవి నుంచి శ్రీనివాసన్ అప్పట్లో తప్పించాడని వెంగ్ సర్కార్ ఆరోపించాడు. దీనిపై తాజాగా శ్రీనివాసన్ స్పందించాడు.

‘2008లో జరిగిపోయిన విషయాన్ని వెంగ్ సర్కార్ ఇప్పుడు ప్రస్తావించడం సంస్కారం కాదు. జట్టు ఎంపికలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం వల్లే అతని చీఫ్ సెలక్టర్ పదవి పోయిందనడంలో వాస్తవం లేదు. అప్పట్లో అతను ముంబయి క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకు ఆసక్తి కనబర్చాడు. అందుకే అతడ్ని సెలక్షన్ కమిటీలోకి తీసుకోలేదు. బద్రీనాథ్‌ని పక్కన పెట్టడం వల్లే పదవి పోయిందుంటున్నా..? శ్రీలంక పర్యటన కోసం విరాట్ కోహ్లితో పాటు బద్రీనాథ్‌ని కూడా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం ఇక్కడ వెంగ్ సర్కార్ మరిచిపోయినట్లున్నాడు’ అని శ్రీనివాసన్ ఘాటుగా స్పందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.