యాప్నగరం

ఆస్ట్రేలియా కాచుకో..! యార్కర్లతో వికెట్లు విరగొట్టి.. ఎగరగొట్టిన బుమ్రా, షైనీ

శ్రీలంకతో టీ20 సిరీస్‌ని ఏకపక్షంగా ముగించిన టీమిండియా.. మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌‌కి సిద్ధమవుతోంది. దీంతో.. బుమ్రా, షైనీ యార్కర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Samayam Telugu 13 Jan 2020, 7:54 pm
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లకి వన్డే సిరీస్‌ ముంగిట భారత ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ షైనీ చెమటలు పట్టిస్తున్నారు. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. ఈరోజు అక్కడ నెట్స్‌లో టీమిండియా ప్రాక్టీస్ చేసింది. రేపు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.
Samayam Telugu Navdeep Saini, Jasprit Bumrah



టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ షైనీ.. పదునైన యార్కర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గాయం నుంచి ఇటీవల కోలుకుని మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు పేసర్లు.. శ్రీలంకతో గత శుక్రవారం ముగిసిన టీ20 సిరీస్‌లో నిలకడగా రాణించిన విషయం తెలిసిందే.

ప్రాక్టీస్ సెషన్‌లో మూడు స్టంప్‌లను ఉంచిన కోచ్ భరత్ అరుణ్.. క్రీజులో బ్యాట్స్‌మెన్‌ పాదాలపై అవగాహన కోసం రెండు షూస్‌ని ఉంచాడు. దీంతో.. పోటాపోటీగా యార్కర్లు సంధించిన బుమ్రా, షైనీ.. మిడిల్, లెగ్ స్టంప్‌లను విరగొట్టడంతో పాటు.. ఆఫ్ స్టంప్‌ని అయితే ఏకంగా గాల్లోకి ఎగరగొట్టేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.