ప్రపంచకప్కి ముందు తప్పిదాలను దిద్దుకునేందుకు ఇంగ్లాండ్ పర్యటన భారత జట్టుకి ఉపయోగపడుతోందని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో అనూహ్యంగా ఓడిన భారత్ 1-2 తేడాతో వన్డే సిరీస్ను చేజార్చుకుంది. 2016, జనవరి తర్వాత భారత్ ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్ను చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ వేదికగానే 2019 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. తాజా సిరీస్ ఓటమి భారత్కి హెచ్చరిక అని కోహ్లి వివరించాడు.
మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (71: 72 బంతుల్లో 8x4) అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే 260/2తో ఛేదించేసింది. జో రూట్ (100 నాటౌట్: 120 బంతుల్లో 10x4) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 నాటౌట్: 108 బంతుల్లో 9x4, 1x6) సమయోచిత ఇన్నింగ్స్తో ఆ జట్టుని విజయతీరాలకి చేర్చాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లోనూ భారత్ పేలవరీతిలో విఫలమైంది.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘ప్రపంచకప్కి ముందు ఈ తరహా మ్యాచ్లు జట్టు తప్పిదాలు దిద్దుకునేందుకు ఉపయోగపడతాయి. జట్టులో మేము ఇంకా సమతూకం సాధించాల్సి ఉంది. వరల్డ్కప్ కంటే ముందే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాం. అలా అని ఒకదానిపైనే దృష్టి సారించం. మొత్తం.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ మెరుగవ్వాల్సి ఉంది. మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఆ మూడు విభాగాల్లోనూ మెరుగ్గా రాణించింది. వారు విజయానికి అర్హులు’ అని విరాట్ కోహ్లి వెల్లడించాడు.
మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (71: 72 బంతుల్లో 8x4) అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే 260/2తో ఛేదించేసింది. జో రూట్ (100 నాటౌట్: 120 బంతుల్లో 10x4) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 నాటౌట్: 108 బంతుల్లో 9x4, 1x6) సమయోచిత ఇన్నింగ్స్తో ఆ జట్టుని విజయతీరాలకి చేర్చాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లోనూ భారత్ పేలవరీతిలో విఫలమైంది.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘ప్రపంచకప్కి ముందు ఈ తరహా మ్యాచ్లు జట్టు తప్పిదాలు దిద్దుకునేందుకు ఉపయోగపడతాయి. జట్టులో మేము ఇంకా సమతూకం సాధించాల్సి ఉంది. వరల్డ్కప్ కంటే ముందే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాం. అలా అని ఒకదానిపైనే దృష్టి సారించం. మొత్తం.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ మెరుగవ్వాల్సి ఉంది. మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఆ మూడు విభాగాల్లోనూ మెరుగ్గా రాణించింది. వారు విజయానికి అర్హులు’ అని విరాట్ కోహ్లి వెల్లడించాడు.