యాప్నగరం

IPL 2021: మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు.. ఇదే ఫైనల్..?

ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి రోజుకో కొత్త వార్త వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సీజన్లో కొత్తగా రెండు ఫ్రాంఛైజీలు బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది.

Samayam Telugu 4 Dec 2020, 1:34 pm
ఐపీఎల్ 2021కు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. వచ్చే సీజన్లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలు రావడం ఖాయమని తెలుస్తోంది. డిసెంబర్ 24న జరగనున్న బోర్డు యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 2011లో నిర్వహించిన ఐపీఎల్ పదో సీజన్లోనూ పది జట్లు బరిలో దిగాయి. వచ్చే సీజన్లో ఒక జట్టే బరిలో దిగుతుందని.. ఆ తర్వాతి సీజన్లో పదో ఫ్రాంచైజీ బరిలో దిగుతుందని వార్తలొచ్చాయి. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ఖాయమైందని సమాచారం
Samayam Telugu Dream 11 IPL 2021


కానీ ఐపీఎల్ 2021లో ఫార్మాట్ మారే అవకాశం ఉందని సమాచారం. 2011లో 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. లీగ్ దశలో అన్ని జట్లు కలిపి 14 మ్యాచ్‌లే ఆడాయి. ఇదే విధానాన్ని వచ్చే సీజన్లోనూ అనుసరిస్తారని తెలుస్తోంది. ర్యాండమ్ డ్రా ద్వారా గ్రూపులోని జట్టు ఇతర జట్లతో ఒక మ్యాచ్ లేదా రెండు మ్యాచ్‌లు ఆడే విషయాన్ని నిర్ధారిస్తారు. ఈ ఫార్మాట్ కాస్త గందరగోళంగా అనిపించినా.. 2011 సీజన్లో బీసీసీఐకి చాలా సమయం ఆదా అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.