యాప్నగరం

Wellington test: న్యూజిలాండ్‌కు భారీ ఆధిక్యం

తొలి టెస్టుపై న్యూజిలాండ్ ప‌ట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన కివీస్ కీల‌క‌మైన 183 ప‌రుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 165 పరుగులకే కుప్పకూలింది.

Samayam Telugu 23 Feb 2020, 7:49 am
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ కు భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. ఆదివారం మూడో రోజు 216/5 ఓవ‌ర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన న్యూజిలాండ్ 348 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 183 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. ఆట ప్రారంభంలో వికెట్లను చకచకా తీసిన భారత బౌలర్లు తర్వాత టెయిలెండర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. తొలి టెస్టు ఆడుతున్న కైలీ జెమిస‌న్ (45 బంతుల్లో 44, 1 ఫోరు, 4 సిక్స‌ర్లు ) సత్తా చాటాడు. అలాగే కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (74 బంతుల్లో43, 5 ఫోర్లు), ట్రెంట్ బౌల్ట్ (24 బంతుల్లో 38,5 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసేందుకు సహకరించారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (5/68)కు ఐదు వికెట్లు దక్కాయి.
Samayam Telugu New Zealand v India - First Test
Trent Boult


Read Also: undefined

నిజానికి మూడో రోజు ఆట ప్రారంభం లోనే భారత బౌలర్లు రెండు వికెట్లు తీశారు. ఓవ‌ర్‌నైట్‌ బ్యాట్స్‌మ‌న్‌ వాట్లింగ్ (14)తో సహా టిమ్ సౌతీ (6)ని త్వరగానే అవుట్ చేశారు. ఈ దశలో గ్రాండ్‌హోమ్‌- జెమిస‌న్ ఇద్దరు కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇద్ద‌రూ ధాటిగా ఆడుతూ ఎనిమిదో వికెట్‌కు 71 అమూల్యమైన పరుగులను జోడించారు. స్కోరు 296 పరుగులకు చేరుకోగానే జెమీస‌న్ పెవిలియ‌న్‌కు చేరాడు. కాసేపటికే కొలిన్‌ కూడా అవుట్ కావడంతో న్యూజిలాండ్ త్వరగానే ఆల్ అవుట్ అవుతుందని భావించారు. ఈ దశలో అనూహ్యంగా ట్రెంట్ బౌల్ట్ ట్విస్ట్ ఇచ్చాడు. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి, కీలకమైన పరుగులు సాధించాడు. త‌ను 38 పరుగులు చేయడంతో కివీస్ 348 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో కివీస్ త‌ర‌పున కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (89) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. దీంతో భోజన విరామాన్ని ప్రకటించారు.

Read Also: Team India: త‌్వ‌ర‌లోనే ఒక ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్న భారత క్రికెట‌ర్లు!
భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లతో సత్తా చాటాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/99) మూడు వికెట్లు తీశాడు. మొహమ్మద్ షమీ, జస్‌ప్రీత్‌ బూమ్రా కు చెరో వికెట్ లభించింది. భారత తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆట ఇంకా మరో రెండున్నర రోజులు మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.