యాప్నగరం

న్యూజిలాండ్ టీ20 రికార్డ్ గంటల్లోనే కనుమరుగు

క్రికెట్‌లో గత మూడు రోజుల నుంచి అనూహ్యంగా ఏళ్లనాటి ప్రపంచ రికార్డులు బద్ధలైపోతున్నాయి. గత మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన

Samayam Telugu 21 Jun 2018, 4:06 pm
క్రికెట్‌లో గత మూడు రోజుల నుంచి అనూహ్యంగా ఏళ్లనాటి ప్రపంచ రికార్డులు బద్ధలైపోతున్నాయి. గత మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 481 పరుగులు చేసిన ఇంగ్లాండ్ పురుషుల జట్టు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. తాజాగా ఇంగ్లాండ్ మహిళల జట్టు టీ20లో 250 పరుగులు చేసి టీ20ల్లో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది.
Samayam Telugu ..


ఇంగ్లాండ్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మహిళల జట్లు ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తాజాగా జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 216 పరుగులు చేసింది. టీ20ల్లో మహిళల జట్టుకి ఇదే టాప్ స్కోర్. కానీ.. ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం మళ్లీ దక్షిణాఫ్రికా జట్టుపైనే రెండో టీ20 మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్ మహిళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి ఆ రికార్డుని బద్ధలుకొట్టింది. దీంతో.. 4 గంటల వ్యవధిలోనే రెండు సార్లు ప్రపంచ రికార్డ్స్‌ని మహిళల జట్లు బ్రేక్ చేశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.