యాప్నగరం

థ్రిల్లింగ్ ఫైట్‌‌లో ఇంగ్లాండ్ గెలిచింది.. కానీ కివీస్ ఫైనల్ చేరింది

హమిల్టన్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. కానీ ఫైనల్ చేరడంలో మాత్రం విఫలమైంది.న

TNN 18 Feb 2018, 3:46 pm
హమిల్టన్: త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ చివరి వరకు విజయం దిశగా సాగింది. కానీ ఆఖరి ఓవర్లలో తడబడి ఓటమి పాలైంది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (47 బంతుల్లో 62; 3x4, 4x6), కాలిన్ మున్రో (21 బంతుల్లోనే (57; 3x4, 7x4) అద్భుత ఆరంభం ఇవ్వడంతో.. కివీస్ గెలుపు బాటలో సాగింది. సిక్సర్లతో చెలరేగిన మున్రో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Samayam Telugu new zealand qualify for tri series final despite losing by 2 runs
థ్రిల్లింగ్ ఫైట్‌‌లో ఇంగ్లాండ్ గెలిచింది.. కానీ కివీస్ ఫైనల్ చేరింది


ఏడు సిక్సర్లు బాదిన మున్రోను అదిల్ రషీద్ పెవిలియన్ చేర్చాడు. అప్పటికే న్యూజిలాండ్ 6.3 ఓవర్లలో 78 పరుగులు చేసింది. విలియమ్సన్ త్వరగానే అవుటైనప్పటికీ.. మరో ఎండ్‌లో గప్టిల్ రాణించడంతో 16.3వ ఓవర్లో 164 పరుగులు చేసింది.

21 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశలో గప్టిల్ అవుటడం కివీస్‌కు విజయాన్ని దూరం చేసింది. రాస్ టేలర్ కూడా వెంటనే పెవిలియన్ చేరడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. ఈ దశలో ఇంగ్లిష్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కివీస్ విజయానికి చివరి ఓవర్లో 11 రన్స్ అవసరమయ్యాయి. ఓ ఎండ్‌లో చాంప్‌మ్యాన్ (30 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడినప్పటికీ, గ్రాండ్‌‌హోమ్ (5 బంతుల్లో 7) బ్యాట్ ఝలిపించ లేకపోయాడు. టామ్ కుర్రాన్ చివరి ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రెండు పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమిపాలైంది.



ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ మెరుగైన రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆసీస్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డావిడ్ మలాన్ (36 బంతుల్లో 53), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (46 బంతుల్లో 80 నాటౌట్) రాణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.