యాప్నగరం

కోహ్లి గైర్హాజరీ ఎఫెక్ట్.. టీమిండియా చెత్త రికార్డ్

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. పరుగుల పరంగా భారీ ఓటమిని టీమిండియా మూట గట్టుకుంది.

Samayam Telugu 6 Feb 2019, 6:17 pm
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ చిత్తుగా ఓడింది. 80 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయిన టీమిండియాకు పొట్టి ఫార్మాట్లో రన్స్ పరంగా ఇదే దారుణ ఓటమి కావడం గమనార్హం. 2010లో ఆస్ట్రేలియా చేతిలో 49 పరుగుల తేడాతో ఓడటమే ఇప్పటి వరకూ భారత్‌కు భారీ ఓటమి. వెల్లింగ్టన్ టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. బదులుగా భారత్ 139 పరుగులకే ఆలౌటయ్యింది.
Samayam Telugu ind odi


భారీ లక్ష్య చేధనలో భారత బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ పోరాడలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ధోనీ చివరి వరకూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు.

విశ్రాంతి కారణంగా విరాట్ కోహ్లి ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కోహ్లి లేకపోవడం వల్లే భారత్ ఓడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.