యాప్నగరం

భారత్ 200లోపు ఆలౌట్.. నెం.1 ఎలా..?: జాఫర్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉన్న భారత జట్టు 200లోపు ఆలౌటవడమా..? అదీ బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్‌ల్లో.. ఇది కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌ల బాధ్యతారాహిత్యమే..! -జాఫర్

Samayam Telugu 28 Feb 2020, 1:14 pm
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా స్థాయికి తగినట్లు ఆడలేకపోయిందని భారత దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా పేరొందిన వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు. కివీస్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్ జట్టు.. 165, 191 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్న టీమిండియా.. ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదీ 200లోపే ఆలౌటవడమేంటి..? అని జాఫర్ పెదవి విరిచాడు.
Samayam Telugu New Zealand v India - First Test


Read More: టీమిండియాకి గాయం దెబ్బ.. బౌలర్ ఔట్
‘తొలి టెస్టులో వెల్లింగ్టన్ పిచ్.. మొదటి ఇన్నింగ్స్‌ సమయంలో బౌలర్లకి అనుకూలంగా కనిపించింది. కానీ.. రెండో ఇన్నింగ్స్‌ టైమ్‌‌కి పిచ్ పరిస్థితి మారింది. అయినప్పటికీ భారత బ్యాట్స్‌మెన్‌లు తేలిపోయారు. కివీస్ బౌలర్లు తెలివిగా బౌన్సర్లు సంధించారు. నిజమే.. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు బాధ్యతగా ఆడి ఉండాల్సింది. ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200లోపే ఆలౌటవడం నెం.1 ర్యాంక్ టీమ్ స్థాయి ఆట అనిపించుకోదు’ అని జాఫర్ వెల్లడించాడు.

IND vs NZ: కివీస్ గడ్డపై కోహ్లీని కట్టిపడేస్తున్న ‘స్నేహం’.. సిరీస్‌లో ఆ ఊపు కరవు
నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకి ఆలౌట్ చేసిన కివీస్.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. దీంతో.. 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 191 పరుగులకే ఆలౌటవగా.. కివీస్ ముందు 9 పరుగుల టార్గెట్ నిలిచింది. దీంతో ఆ జట్టు కేవలం 1.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రెండో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.