యాప్నగరం

ట్రై సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్.. కానీ..?

శ్రీలంక వేదికగా మంగళవారం నుంచే ముక్కోణపు టీ20 టోర్నీ ప్రారంభమవనుంది. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య శ్రీలంకని

TNN 6 Mar 2018, 12:26 pm
శ్రీలంక వేదికగా మంగళవారం నుంచే ముక్కోణపు టీ20 టోర్నీ ప్రారంభమవనుంది. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య శ్రీలంకని ఢీకొట్టనున్న భారత్ జట్టు టోర్నీలోనే ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఈ ఫేవరెట్‌ ట్యాగ్‌ని జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపారేశాడు. ఒక ఓవర్ వ్యవధిలోనే టీ20 మ్యాచ్ స్వరూపం మారిపోతుందని.. ఏ జట్టుకైనా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని రోహిత్ వెల్లడించాడు. ఈ టోర్నీలో భారత్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా పోటీపడుతోంది.
Samayam Telugu nidahas trophy 2018 being favourites doesnt matter to rohit sharma
ట్రై సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్.. కానీ..?


‘టీ20ల్లో ఏ జట్టుకైనా విజయావకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఓవర్ వ్యవధిలోనే మ్యాచ్ గమనం పూర్తిగా మారిపోవడం ఈ ఫార్మాట్‌లో సర్వసాధారణం. అందుకే.. ఏ జట్టునైనా.. ఏ జట్టు అయినా ఓడించే సౌలభ్యం ఉంటుంది. భారత జట్టు ఫేవరెట్.. అవునా..? కాదా..? అని నేను ఆలోచించడం లేదు. టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని మాత్రమే ఆశిస్తున్నా’ అని రోహిత్ శర్మ వివరించాడు. ఈ టోర్నీకి కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ తదితరులకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.