యాప్నగరం

పవర్‌ప్లేలోనే మ్యాచ్ భారత్ చేజారింది..!

ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పరాజయాన్ని తాను ముందుగానే ఊహించినట్లు

TNN 7 Mar 2018, 1:51 pm
ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పరాజయాన్ని తాను ముందుగానే ఊహించినట్లు ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (90: 49 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో హిట్టర్ కుశాల్ పెరీరా (66: 37 బంతుల్లో 6x4, 4x6) దూకుడుగా ఆడటంతో శ్రీలంక మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే.. తొలి పవర్‌ప్లే ముగిసే సమయానికే భారత్‌కు మ్యాచ్ దూరమైందని ఈ ఓపెనర్ వివరించాడు.
Samayam Telugu nidahas trophy sri lanka took the game away in powerplays says dhawan
పవర్‌ప్లేలోనే మ్యాచ్ భారత్ చేజారింది..!


తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పవర్‌ప్లే (మొదటి ఆరు ఓవర్లు) ముగిసే సమయానికి 40/1తో నిలవగా.. ఛేదనలో పవర్‌ప్లే ముగిసే సమయానికి శ్రీలంక 75/2తో మెరుగై స్థితిలో నిలిచింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా.. వరుసగా 4 4, 4, 6, 4Nb, 4, 0 బాదేయడంతో ఈ స్కోరు సాధ్యమైంది.

‘మొదటి ఆరు ఓవర్లలోనే భారత్‌‌కి మ్యాచ్‌ను శ్రీలంక దూరం చేసేసింది. పవర్‌‌ప్లే ముగిసిన తర్వాత.. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్ చేయడాన్ని బాగా తగ్గించారు. పిచ్‌ నెమ్మదించడం కూడా ఓ కారణం కావొచ్చు..? అయినా.. ఆ జట్టు గెలవగలిగింది. కుశాల్ పెరీరా ఒకే ఓవర్‌లో 27 పరుగులు రాబట్టడం, పవర్‌ప్లేలోనే 75 పరుగులు చేయడం మ్యాచ్‌లో కీలక మలుపు. ఆదిలోనే రోహిత్ శర్మ (0), సురేశ్ రైనా (1) వికెట్లను చేజార్చుకోవడం భారత జట్టుని ఎక్కువ దెబ్బతీసింది. ఒకవేళ వికెట్లు పడకుండా ఉండుంటే.. భారత్‌ మరింత దూకుడుగా ఆడేది..!’ అని ధావన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.