యాప్నగరం

నాలుగు రోజుల టెస్టు.. భారత్ తిరస్కరణ

ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్న నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ప్రతిపాదనని భారత్ తిరస్కరించింది. సుదీర్ఘ

TNN 17 Oct 2017, 4:08 pm
ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్న నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ప్రతిపాదనని భారత్ తిరస్కరించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టు ఫార్మాట్‌ సంప్రదాయానికి భంగం కలిగించే రీతిలో ఈ ప్రతిపాదన ఉండటంతోనే బీసీసీఐ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డ్ మీటింగ్‌లో ఈ నాలుగు రోజుల టెస్టు గురించి చర్చ జరిగింది. త్వరలోనే దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య ప్రయోగాత్మకంగా ఈ టెస్టు‌ని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
Samayam Telugu no four day test for india in near future bcci
నాలుగు రోజుల టెస్టు.. భారత్ తిరస్కరణ


‘భారత్ జట్టు ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను ఆడదు. ఇప్పుడే కాదు.. భవిష్యతలో కూడా ఆడబోదు. టీమిండియాతో ఏదైనా టెస్టు సిరీస్‌ ఆడాలనుకుంటే ఐదు రోజుల ఫార్మాట్‌లో అయితేనే రండి’అని బీసీసీఐ అన్ని దేశాలకి స్పష్టం చేసింది. ఐసీసీ సభ్య దేశాలన్నీ ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ప్రతిపాదనని అంగీకరిస్తున్నా బీసీసీఐ మాత్రం మొండిగా తిరస్కరిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఆదాయ పంపిణీపై బీసీసీఐ, ఐసీసీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.