మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ఆడలేకపోతున్నాననే లోటుని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీర్చనుందని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. బెంగళూరు వేదికగా గత శని, ఆదివారం జరిగిన ఐపీఎల్ 2018 వేలంలో హర్భజన్ సింగ్ని రూ. 2 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ తొలి సీజన్ 2008 నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతూ వచ్చిన హర్భజన్ని ఈ ఏడాది ఆ ఫ్రాంఛైజీ వదులుకుంది. మరోవైపు చెన్నైకి ఆడిన రవిచంద్రన్ అశ్విన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ రూ. 7.6 కోట్లకి కొనుగోలు చేయడంతో అతని స్థానంలో హర్భజన్ని వేలంలో సీఎస్కే కొనుగోలు చేసింది.
చెన్నై తనని కొనుగోలు చేయడంపై మీడియాతో మంగళవారం హర్భజన్ మాట్లాడుతుండగా ‘మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ప్రపంచకప్ గెలిచారు. ఆ తర్వాత అతని కెప్టెన్సీలోనే మీరు టీమిండియాలో చోటు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ధోనీ కెప్టెన్సీలోనే చెన్నైలో ఆడబోతున్నారు. ఈ మార్పుని ఎలా చూడబోతున్నారు..?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. భజ్జీ సమాధానమిచ్చాడు. ‘ధోనీ చాలా కామ్.. అతని భుజస్కంధాలపై చాలా పెద్ద బాధ్యతలున్నాయి. అతనితో కలిసి మళ్లీ మ్యాచ్లు ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాలో మేమిద్దరం కలిసి ఆడేందుకు అవకాశం మళ్లీ దొరుకుతుందో లేదో తెలీదు. కనీసం చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా దొరికినందుకు హ్యాపీ. ముంబయి ఇండియన్స్ జట్టు నుంచి పక్కకి వచ్చినందుకు నాకేమీ బాధగా లేదు.’ అని హర్జజన్ వెల్లడించాడు.
చెన్నై తనని కొనుగోలు చేయడంపై మీడియాతో మంగళవారం హర్భజన్ మాట్లాడుతుండగా ‘మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ప్రపంచకప్ గెలిచారు. ఆ తర్వాత అతని కెప్టెన్సీలోనే మీరు టీమిండియాలో చోటు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ధోనీ కెప్టెన్సీలోనే చెన్నైలో ఆడబోతున్నారు. ఈ మార్పుని ఎలా చూడబోతున్నారు..?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. భజ్జీ సమాధానమిచ్చాడు. ‘ధోనీ చాలా కామ్.. అతని భుజస్కంధాలపై చాలా పెద్ద బాధ్యతలున్నాయి. అతనితో కలిసి మళ్లీ మ్యాచ్లు ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాలో మేమిద్దరం కలిసి ఆడేందుకు అవకాశం మళ్లీ దొరుకుతుందో లేదో తెలీదు. కనీసం చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా దొరికినందుకు హ్యాపీ. ముంబయి ఇండియన్స్ జట్టు నుంచి పక్కకి వచ్చినందుకు నాకేమీ బాధగా లేదు.’ అని హర్జజన్ వెల్లడించాడు.